Home Minister Taneti Vanitha: అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదయాత్ర.. ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల యాత్రపై స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. సంచలన ఆరోపణలు చేశారు.. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అభివర్ణించిన ఆమె.. రైతుల పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న యాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకులే యాత్ర చేస్తున్నారని విమర్శించిన హోం మంత్రి… యాత్ర చేస్తున్న వారు ఎక్కడికి వెళ్లినా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని.. ప్రజలను, పోలీసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పచ్చ మీడియాలో పబ్లిసిటీ కోసమే అమరావతి యాత్ర సాగుతోందన్న ఆరోపించిన ఆమె.. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసిన హోంమంత్రి.. రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
Read Also: YS Jagan: మరో ఏడాదిన్నరలో ఎన్నికలు.. ఈ రోజు నుంచే సిద్ధం కావాలి…
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు రెండో విడత పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. వెంకటపాలెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామివారి రథాన్ని ముందుకు నడిపి పాదయాత్రను ప్రారంభించిన రైతులు.. రెండో విడతలో అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు.. వికేంద్రీకరణ ముద్దు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. జేఏసీ విశాఖ గర్జనకు సిద్ధమైంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!