Minister Satyakumar: కేతిరెడ్డిపై మద్యం బాంబు.! ప్రైవేటు పరం కాదంటూ కౌంటర్.!
- ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మద్యం కుంభకోణ ఆరోపణలు
- వైద్య కళాశాలలు ప్రైవేటు పరం కావు.. పీపీపీ మోడల్ స్పష్టీకరణ
- కోటి 23లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి
- అసెంబ్లీలోకి రావాలని జగన్కు మంత్రి సత్యకుమార్ సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar: అనంతపురం జిల్లాలో మంత్రి సత్యకుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల అనేక కుంభకోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కేతిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని, అది తమకు ముందే తెలిసిన విషయమేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల సతీసమేతంగా ధర్మవరంలో ఒకటిన్నర రోజు గడిపారని గుర్తు చేసిన సత్యకుమార్, “ఆ రోజుల్లో ఏ లెక్కలు మాట్లాడుకున్నారో ప్రజల ముందుకు తేలాలి” అని అన్నారు. రాయలసీమకు మద్యం డబ్బులు ఎవరి ప్రాంతం ద్వారా వెళ్లలేదని, దానిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
WhatsApp: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీ.. దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్..
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. “వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం లేదు. పీపీపీ మోడల్లో నిర్మాణం చేపడుతున్నాం. కానీ యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయి” అని స్పష్టం చేశారు. అలాగే, దీనిపై విమర్శలు చేసే వారు కూడా స్వయంగా టెండర్లలో పాల్గొనాలని సవాలు విసిరారు. వైసీపీకి ప్రజల ఆరోగ్యం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, గతంలో మీరే ఈ నిర్మాణాలను ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం కోటి 23 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. తురుకపాలెంలో చోటుచేసుకున్న ప్రత్యేక పరిస్థితులపై ఇప్పటికే హైలెవల్ ఎంక్వైరీ వేయబడిందని చెప్పారు. వైసీపీ నేత జగన్పై నేరుగా దాడి చేసిన మంత్రి సత్యకుమార్, “జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అప్పుడు అన్ని విషయాలపై చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నాం” అని సవాలు విసిరారు.
Puri & Sethupathi : ప్రత్యేక ఎంట్రీ సీక్వెన్స్ కోసం పూరి స్పెషల్ ప్రిపరేషన్
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..