Minister Roja: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమో.. కాదో..? నేను కారు కొంటే తప్పేంటి?
Minister Roja: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వీడియోపై మంత్రి రోజా స్పందించారు. అసలు ఎంపీ మాధవ్ వీడియో.. నిజమో కాదో తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శలు చేయడంపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఘటనపై ఎంక్వయిరీ జరుగుతోందని.. అప్పుడు అంత తొందర దేనికి అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా టీడీపీ, జనసేన నేతలు తన జపం చేస్తున్నారని.. తన మీద వారికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధం అవుతోందని మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవన్నారు. ప్రజల ఆశీస్సులతో తాను మంత్రి కావడం చూసి టీడీపీ నేతలు జెలసీ ఫీలవుతున్నారని రోజా చురకలు అంటించారు.
Read Also: Satyanarayana Swamy Vratam: పంతుళ్లు కూడా అప్డేట్ అవుతున్నారా? ఇంగ్లీష్లో సత్యనారాయణస్వామి వ్రతం
Also Read
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
- Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మహిళలపై దారుణమైన ఘటనలు జరిగాయని.. వాటిపై గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి రోజా ఆరోపించారు. నారాయణ స్కూలులో ఎంతో మంది ఆడపిల్లలు చనిపోయారని.. ఈ ఘటనలకు సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శలు చేశారు. మహిళలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే జగన్ వదిలిపెట్టరని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటారని మంత్రి రోజా తెలిపారు. మరోవైపు తాను కారు కొనుగోలు చేయడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. తాను కారు కొనుగోలు చేస్తే అది రిషికొండ గిఫ్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారని.. ప్రస్తుత రోజుల్లో చిన్న యాంకర్లు, చిన్న చిన్న నటీనటులు కూడా కారు కొంటున్నారని.. అయినా తాను కారు కొనడం గొప్పేమీ కాదని.. ఈ విషయంపైనా టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. జబర్దస్త్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నానో బ్యాంక్ లావాదేవీలు చూస్తే తెలుస్తుందని. చదువురాని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదని రోజా సమాధానం ఇచ్చారు.
కాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు మంత్రి రోజా ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన భారతీయత కళకు ప్రతిరూపం.. గౌరవం, మన్నన తెచ్చే మన చేనేత వస్త్రం.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. నిండైన భారతీయతకు నిజమైన అర్థాన్నిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దామని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
నిండైన భారతీయతకు నిజమైన అర్థాన్నిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం…
నేతన్నలకు చేయూతనిద్దాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు #NationalHandloomDay #NationalHandloomDay_2022 pic.twitter.com/HDSyx4mG6i— Roja Selvamani (@RojaSelvamaniRK) August 7, 2022
తాజావార్తలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!