Minister Roja: భీమ్లానాయక్ బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు మంత్రి ఆర్కే రోజా.. ఈ కార్యక్రమాల్లో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. దేశమంతా చూసేలా రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి విగ్రహావిష్కరణ చేసిందన్నారు.. ప్రధాని మోడీని ఘనంగా స్వాగతించి కార్యక్రమం విజయవంతం చేశామన్న ఆమె.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: GodFather: ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్లో ఏముంది!?
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ఇక, చంద్రబాబు, లోకేష్… పవన్ కల్యాణ్ని జాకీలు వేసి లేపాలని చూస్తున్నారంటూ కామెంట్ చేశారు ఆర్కే రోజా.. జాకీలు విరిగీపోతున్నాయి.. కానీ, వాళ్లు పైకి లేవడంలేదన్న ఆమె.. అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు, సచివాలయాలు రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాగా, ఇవాళ ఏపీలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన.. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా.. అంటూ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.. ఇక, అల్లూరి జీవితం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం చాలా గొప్పదని.. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిగాధ తెలియాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్, సీఎం జగన్ వీడ్కోలు పలికారు.. ఏపీకి నిధులు కేటాయించాలంటూ.. ఓ విజ్ఞాపన పత్రాన్ని కూడా పీఎంకు సమర్పించారు సీఎం జగన్.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!