Minister Ramprasad Reddy: ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధి చేయాలి.. !
- సంబేపల్లి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
- సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టిన ఎంపీటీసీ.. జడ్పీటీసీలు..
- ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గైర్హజర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్దికి నోచుకోని మండలం సంబేపల్లి అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 శాతం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సంబేపల్లి మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించలేదు అని ఆరోపించారు. మండల కేంద్రాలలో ఎటువంటి పని లేకున్నా.. సర్వసభ్య సమావేశాలలో అధికారులపై పెత్తనం చెలాయించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడెక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రభుద్దులకు సమావేశానికి రాకపోవడానికి సిగ్గుశరం ఉందా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.
Read Also: Mumbai Accident : ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. బైక్ ను ఢీకొట్టడంతో మహిళ మృతి
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ఇక, ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ సొంత మీటింగ్ కాదు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మండలం అభివృద్దికి కావాల్సిన వాటి గురించి చర్చ జరగడానికే ఈ సమావేశం.. అలాంటి సమావేశానికి సిగ్గు శరంలేకుండా రాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి మండల అభివృద్ది కోసం ప్రతి ప్రజా ప్రతినిధి కృషి చేయాలి అని పేర్కొన్నారు. అలా చేయని యెడల ప్రజల దగ్గర అవమానాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ఉన్నప్పుడే కావాల్సిన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది.. తెలుగుదేశం పార్టీని సంబేపల్లి మండల ప్రజలు ఎంతో ఆదరించారు.. ఈ ఐదేండ్లలో సంబేపల్లి మండలాన్ని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!