Minister Narayana: అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు..
- చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు..
- అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు.. అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం.. రైతు కూలీలకూ పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయం.. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నామన్నారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించాం.. సోమ, మంగళవారాల్లో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాం.. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
Also Read
ఇక, సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను తీసుకోవడానికి అథార్టీ నిర్ణయించింది.. 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.. గత ప్రభుత్వం 6993.20 చదరపు కిలో మీటర్లకు కుదించింది.. దీన్ని తిరిగి పాత విధానం మేరకు పరిధి ఉండాలని అథార్టీలో నిర్ణయించాం.. కోర్ క్యాపిటల్ ఏరియాను తిరిగి 217 చదరపు కిలోమీటర్ల ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం.. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది అని నారాయణ ఆరోపించారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
అలాగే, సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. కరకట్ట రోడ్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించాం.. కరకట్ట నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నాం.. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే.. అంత వరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిలోని ఈ-5,11,13,15 రోడ్లను ఎన్ హెచ్ కు కలిపేలా చర్యలు తీసుకుంటాం.. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్లు ఉంటాయి.. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు.. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?