Kottu Satyanarayana: టీడీపీతో కలిసి వెళ్లకూడదని మోడీ నిర్ణయం..!? ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మోసపూరిత పార్టీ అని ఆ పార్టీతో కలసి వెళ్లకూడదని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతుందని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. కార్తీకమాసం సోమవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు.. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు ఆలయ మర్యాదలనుసరించి అర్చకులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి దంపతులకు అర్చకులు వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా.. స్వామి అమ్మవారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను ఈవో లవన్న అందజేశారు.
Read Also: Superstar Krishna: ఆయన ఓ ఫైటర్.. దీన్నుంచి బయటికి వస్తారు
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ.. శ్రీశైలంలో నిన్నటి ట్రాఫిక్ జామ్కి కారణం పోలీస్ సిబ్బంది లోపమే అన్నారు.. నిన్న రాత్రి నేను కూడా రెండు గంటలు ట్రాఫిక్ లో ఉన్నానని మంత్రి కొట్టు అన్నారు. ఇక, రాజకీయాలపై స్పందించిన ఆయన.. నారా లోకేష్కి సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.. మంగళగిరి అని స్పష్టంగా పలకమని చెప్పమనండి లోకేష్ ని చూద్దామంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే పవన్ కల్యాణ్ అలా నడుచుకుంటున్నాడని ఆరోపించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ నోరు తగ్గించుకున్నరాని సెటైర్లు వేశారు. ఇక, జగనన్న కాలనీలమీద సోషల్ ఆడిట్ అని పవన్ కల్యాణ్ తప్పుచేస్తున్నాడని మండిపడ్డారు.. ఇప్పటికే పవన్ మాటతీరు పరివర్తన భాషాతో మా సామాజికవర్గంలో ఇలాంటి నాయకుడినా మేం అనుకున్నది అనే పరిస్థితికి పవన్ వచ్చాడని ఎద్దేవా చేశారు.. జగనన్న కాలనీలలోకెళ్లి పవన్ కల్యాణ్ సోషల్ ఆడిట్ చేస్తే మహిళలందరూ.. చీపురుకట్ట తిరగేసికొట్టే పరిస్థితి ఉందని హెచ్చరించారు.. అలానే విశాఖ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవిస్తే విశాఖని అభివృద్ధి చేయొచ్చని మోడీ చెప్పారాని.. దీంతో, విశాఖను రాజధానిగా చేసేదానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినట్లుగా నిన్న మోడీ మాట్లాడారని చెప్పారు. ఇదే సమయంలో.. టీడీపీ మోసపూరిత పార్టీ అని.. ఆ పార్టీతో కలసి వెళ్లకూడదని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!