Kakani Govardhan Reddy: వాళ్లు డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి.. పార్టీ ప్రక్షాళన చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kakani Govardhan Reddy On Suspended MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు అధిష్టానం వద్ద ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విధంగా మాట్లాడారని వివరణ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదన్న ఆయన.. జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు.
Bandi sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం.. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు..
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
ఇదే సమయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ గెలిచిందో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేలను రూ.10 కోట్లకు టీడీపీ కొనుగోలు చేసి, ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ విజయంపై పచ్చ మీడియా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూచంద్రబాబును ప్రజలు ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దత్తపుత్రుడుతో కలిసి పోటీ చేసినా.. చంద్రబాబుకు ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని పంపించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని కొనాలని చంద్రబాబు డబ్బులు పంపించిన వైనం దేశమంతా చూసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు అలవాటేనని పేర్కొన్నారు.
Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్
ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ హైకమాండ్, నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! అంతర్గతంగా దర్యాప్తు చేసి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారని తెలిసి.. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా ఇచ్చి కొనుగోలు చేశారని సజ్జల రామకృష్ణా ఆరోపించారు. అది నిరూపించాలని సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, పై విధంగా తమ వద్ద సాక్ష్యాలున్నాయని మంత్రి కాకాణి బదులిచ్చారు.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..