Jogi Ramesh: సంక్రాంతి ప్యాకేజ్ కోసమే.. చంద్రబాబు, పవన్ భేటీపై జోగి రమేశ్ కౌంటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh Satires On Chandrababu Naidu Pawan Kalyan Meeting: పవన్ కల్యాణ్, చంద్రబాబు తాజా భేటీపై మంత్రి జోగి రమేశ్ కౌంటర్ల వర్షం కురిపించారు. తానిప్పుడే కొన్ని టీవీ ఛానెళ్లలో ‘పవర్ఫుల్’ మీట్ అనే కొటేషన్తో వార్తలు చూశానని.. అది పవర్ఫుల్ మీట్ కాదు, పవర్ఫుల్ ప్యాకేజ్ అని సెటైర్ వేశారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కందుకూరులో, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తారని.. చంద్రబాబు ఇంటికి పరామర్శించడానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అభం శుభం తెలియని అమాయకులు చనిపోతే.. ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని పరామర్శించి, ‘నేనున్నాను’ అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్తారన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ అలా కాకుండా కుప్పంలో డ్రామాలాడిన చంద్రబాబుని కలిసేందుకు హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకి ఏం జరిగిందని పరామర్శించడానికి పవన్ వెళ్లాడు? అని నిలదీశారు.
Gudivada Amarnath: పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ఇంకా చంద్రబాబే సభలతో పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయించాడని జోగి రమేశ్ ఆరోపణలు చేశారు. తనకు అసలు ఎదురే లేదన్నట్టుగా.. రోడ్ల వెంట చంద్రబాబు తిరిగారని ఆగ్రహించారు. ‘‘నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తావ్, ఎన్ని సీట్లు ఇస్తావ్, నేనెక్కడ అమ్ముడుపోవాలి?’’ అనే విషయాలు మాట్లాడటం కోసమే.. దత్తతండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని వ్యాఖ్యానించారు. బయట మాత్రం జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, లోపల మాత్రం ప్యాకేజ్ వ్యవహారాలే నడుస్తాయని, ఈ విషయాలు తమకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలన్న దురుద్దేశంతో కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ని ఒక అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఒక పార్టీకి లీడర్ అయిన పవన్ కల్యాణ్.. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?
పవన్, చంద్రబాబులకు ప్రజా సమస్యలేమీ పట్టలేదని.. కేవలం దోచుకోవడం మీదే దృష్టంతా అని జోగి రమేశ్ పేర్కొన్నారు. 2014 నుంచి 2019 దాకా వాళ్లిద్దరు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి, పవన్ కల్యాణ్లకు ఓటమి తప్పదని.. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని థీమా వ్యక్తం చేశారు. మీరిద్దరు కలిసొచ్చినా.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇస్తారని నమ్మకం వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచి.. విజయ దుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!