Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Punjab School Principal Offers Free Air Travel To Top Scoring Students

School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

Published Date :January 8, 2023 , 12:46 pm
By Mahesh Jakki
School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

School Principal Offer: విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. చదువులో విద్యార్థులు మరింతగా రాణించేందుకు మన దేశంలో ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టాపర్‌లకు ఉచిత విమాన, రైలు, రోడ్డు ప్రయాణాన్ని ప్రకటించారు. దానిని నిజం చేసి కూడా నిరూపించారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర బోర్డు పరీక్షల్లో మెరిట్‌ మార్కులు తెచ్చుకోవడంతో.. సంతోషించిన ప్రిన్సిపాల్ వారి విమాన ప్రయాణ కోరికను నెరవేర్చడానికి కూడా వెనకాడలేదు. తన 12 సంవత్సరాల ఆకాంక్షను విద్యార్థులు నెరవేర్చారని వారి కోరికను కాదనలేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఫిరోజ్‌పూర్‌లోని జిరాలో ఉన్న షాహీద్ గురుదాస్ రామ్ మెమోరియల్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ (బాలికలు) ప్రిన్సిపాల్ రాకేష్ శర్మ, విద్యార్థుల విమాన ప్రయాణ ఖర్చులను సొంతంగా తన జేబులో నుంచి భరిస్తున్నారు.

పాఠశాలలోని 10, 12 తరగతుల విద్యార్థులు గత 12 సంవత్సరాలుగా పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పరీక్షల మెరిట్ జాబితాలో చేరడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివేలా ప్రేరేపించేందుకు విద్యార్థులకు ఉన్న కోరికలను ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు. వారు పరీక్షల్లో మెరిట్ సాధిస్తే కోరికలను నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు విమానంలో ప్రయాణించాలని తమ కోరికను ప్రిన్సిపాల్‌కు చెప్పారు. పరీక్షల్లో వారు మెరిట్ సాధించగా.. వారి కోరికను ప్రిన్సిపాల్ నెరవేర్చారు. పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని.. భగవంతుని దయతో నలుగురు విద్యార్థులు, ఇద్దరు 10వ తరగతి, ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్షలలో మెరిట్ స్థానాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు రాకేష్ శర్మ.

Delhi Police: ఢిల్లీ యువతి కేసు.. పోలీసుల కీలక నిర్ణయం

ఇద్దరు పన్నెండవ తరగతి విద్యార్థులు భజన్‌ప్రీత్ కౌర్, సిమ్రంజీత్ కౌర్.. గత ఏడాది నవంబర్‌లో విమానంలో అమృత్‌సర్ నుంచి గోవాకు విమానంలో వెళ్లారని.. వారిద్దరూ గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్‌పో (INEX-2022)కి హాజరయ్యారని ప్రిన్సిపాల్ చెప్పారు. భజన్‌ప్రీత్ తండ్రి స్థానిక గురుద్వారాలో పూజారి కాగా.. సిమ్రంజీత్ తండ్రి ట్రక్ మెకానిక్. మరో ఇద్దరు విద్యార్థులు జనవరి చివరి వారంలో విమానంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళతారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్, ఎర్రకోట తదితర ప్రాంతాలను వారు సందర్శిస్తారని ఆయన చెప్పారు. ఇద్దరు విద్యార్థులు విమాన ప్రయాణ సౌకర్యాన్ని పొందడాన్ని చూసిన తర్వాత.. ప్రస్తుతం మళ్లీ 10, 12 తరగతులకు చెందిన మరో 22 మంది విద్యార్థులు ఇప్పుడు మెరిట్ స్థానాలను పొందడం కోసం ముందుకొచ్చారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 2019లో పాఠశాలలో చేరినప్పుడు జిల్లాలోని 56 పాఠశాలల్లో 48వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు, పాఠశాల ఫిరోజ్‌పూర్ జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ప్రిన్సిపాల్ నొక్కి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Free Air Travel
  • Government School
  • Merit Students
  • Punjab
  • Punjab School

తాజావార్తలు

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

  • Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్‌

  • US Report: “R&AW, RSS‌లపై ఆంక్షలు పెట్టాలి”.. యూఎస్ రిపోర్ట్‌పై భారత్ ఘాటు స్పందన..

  • Nepali Gang : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు..

  • Netanyahu: నెతన్యాహు నుంచి కొత్త వీడియో విడుదల.. ఏం చేస్తున్నారంటే..!

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions