Chandra Babu: కేంద్రం మెడలు వంచుతామని.. వీళ్లే మెడలు దించేశారు
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు. సంఘవిద్రోహక శక్తులను వదిలిపెట్టి పోలీసులు టీడీపీ కార్యకర్తల వెంట పడుతున్నారని విమర్శించారు.
ప్రజల ఇబ్బందులపై టీడీపీ నేతలు నిలదీస్తే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచేశారని.. ఏపీలో ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా ఉందా, పెళ్లికానుక, రంజాన్ తోఫా, విదేశీ విద్య ఉన్నాయా అని చంద్రబాబు అడిగారు. ఎన్టీఆర్ క్యాంటీన్లను తీసివేసి జగన్ నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న సంక్షేమం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి అంటూ నాన్న బుడ్డిని అమలు చేస్తున్నారని కౌంటర్ వేశారు. రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారని.. అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ధరలు పెంచి దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Telugu Desam Party: హిందూపురంలో బాలయ్య పర్యటనపై పోలీసుల ఆంక్షలు
గతంలో తాను హైదరాబాద్ నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చానని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాటి అభివృద్ధి ఫలాలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి విజన్ 2029 పెట్టామని.. అమరావతి ఏం పాపం చేసిందో జగన్ చెప్పాలన్నారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2లక్షల- రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. పోలవరం విశిష్టత జగన్ రెడ్డికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. ఇప్పుడు కేంద్రం ముందు వైసీపీ నేతలు మెడలు దించేశారని చంద్రబాబు చురకలంటించారు.
మరోవైపు వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేసింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమన్నారు. రైతులు తమ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వకుండా పోరాడాలని సూచించారు. రైతుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. టీడీపీ రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో