Chandra Babu: కేంద్రం మెడలు వంచుతామని.. వీళ్లే మెడలు దించేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు. సంఘవిద్రోహక శక్తులను వదిలిపెట్టి పోలీసులు టీడీపీ కార్యకర్తల వెంట పడుతున్నారని విమర్శించారు.
ప్రజల ఇబ్బందులపై టీడీపీ నేతలు నిలదీస్తే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచేశారని.. ఏపీలో ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా ఉందా, పెళ్లికానుక, రంజాన్ తోఫా, విదేశీ విద్య ఉన్నాయా అని చంద్రబాబు అడిగారు. ఎన్టీఆర్ క్యాంటీన్లను తీసివేసి జగన్ నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న సంక్షేమం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి అంటూ నాన్న బుడ్డిని అమలు చేస్తున్నారని కౌంటర్ వేశారు. రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారని.. అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ధరలు పెంచి దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
Telugu Desam Party: హిందూపురంలో బాలయ్య పర్యటనపై పోలీసుల ఆంక్షలు
గతంలో తాను హైదరాబాద్ నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చానని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాటి అభివృద్ధి ఫలాలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి విజన్ 2029 పెట్టామని.. అమరావతి ఏం పాపం చేసిందో జగన్ చెప్పాలన్నారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2లక్షల- రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. పోలవరం విశిష్టత జగన్ రెడ్డికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. ఇప్పుడు కేంద్రం ముందు వైసీపీ నేతలు మెడలు దించేశారని చంద్రబాబు చురకలంటించారు.
మరోవైపు వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేసింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమన్నారు. రైతులు తమ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వకుండా పోరాడాలని సూచించారు. రైతుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. టీడీపీ రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!