Minister Gudivada Amarnath: ఏపీకి లక్షా 87 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gudivada Amarnath: గత ప్రభుత్వం నాలుగు సమ్మిట్లను నిర్వహించింది.. అయినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అయితే, తాము అలా కాదు.. రాష్ట్రానికి లక్షా 87 కోట్ల పైబడే పెట్టుబడులు వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.. విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు నాలుగువేల ఎనిమిది వందల రిజిస్ట్రేషన్లు వచ్చాచని వెల్లడించారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చెనెలలో జరుగుతుంది.. కోవిడ్ నేపధ్యంలో ఎటూ వెళ్లలేని పరిస్థితులు చూశాం.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను ఎగ్జిబిట్ చేయాలని ఈ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు.. ఢిల్లీలో 49 దేశాల ప్రతినిధులుతో సమావేశం ఏర్పాటు చేశాం.. టాటా రిలయన్స్, మహీంద్రా, ఇందుజా వంటి అధినేతలకు ఆహ్వానం పంపామని తెలిపారు.
Read Also: Buggana Rajendranath Reddy: ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే టార్గెట్.. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు..
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
14 సెక్టార్లను ఎన్నుకున్నాం.. పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలను మనం పారిశ్రామికవేత్తలకు వివరించగలిగితే బాటుందని సీఎం జగన్ చెప్పారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. అరవై దేశాల వారి పరిశ్రమలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు.. వసతల కల్పనలో కేంద్రం నిర్వహించిన సర్వేలో 97 శాతంతో తొలి స్థానంలో ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు.. 11 ఇండ్రస్ట్రీయల్ కారిడార్స్ దేశ వ్యాప్తంగా పెడుతుంటే అందులో మూడు మన రాష్ట్రంలో ఉన్నాయన్న ఆయన.. ఎంఎస్ఎం యూనిట్లకు చేయూతని ఇచ్చి ఆదుకున్నాం అన్నారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాలలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. పోర్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని చెప్పబోతున్నాం అని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!