Dharmana Prasada Rao: విశాఖ రాజధాని అయితే చంద్రబాబు వచ్చిన నష్టం ఏంటి..? బిజినెస్ చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్లు చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్నారన్న ఆయన.. రీసర్వేకు రైతులు సహకరించి, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని.. రిజిస్ర్టేషన్కు సబ్ రిజిష్ర్టార్ కార్యాలయాలు, ముటేషన్కు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదని.. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని గ్రామ సచివాలయంలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
Read Also: Vishnu Kumar Raju: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను అంగీకరించేది లేదు..!
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి ఒక్క పని కొచ్చిన కార్యక్రమం జిల్లాలో చేపట్టలేదని ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంస్థలు కుడా పెట్టించలేని దిక్కుమాలిన పరిస్థితి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిదని మండిపడ్డారు.. మేం అధికారంలోకి వచ్చాక, రూ.700 కోట్లతో ఉద్దానం కిడ్నీ ప్రభావిత ప్రాంతానికి నీరు అందించే ఏర్పాటు చేశామన్నారు.. పలాసలో 100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.. వంశాధార అంశంలో ఒడిస్సా తో మాటాడారు.. 19 టీఎంసీలతో వంశాధార రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.. రాష్ర్టానికి దూరంగా జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటాడు అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.. అసలు విశాఖలో రాజధాని ఏర్పాటైతే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అంటూ నిలదీశారు.. తొకముడిచి పాదయాత్ర ఆపేసారు.. ఇక్కడకు పాదయాత్ర వచ్చి ఉంటే తెలిసేది అని వార్నింగ్ ఇచ్చారు.. పాదయాత్ర కొనసాగితే టీడీపీకి ఉత్తరాంధ్రలో ఒక్కసీటు కూడా వచ్చిఉండేది కాదన్నారు.. టీడీపీ సాయం చేయలేదు.. చేస్తే ఓర్వలేదని.. సాయం చేస్తున్న నేతలను ఆపేస్తే పాపం తగులుతుందన్నారు.. టీడీపీని శ్రీకాకుళం జిల్లా నుంచి వెలివేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!