Dharmana Prasada Rao: విశాఖ రాజధాని అయితే చంద్రబాబు వచ్చిన నష్టం ఏంటి..? బిజినెస్ చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్లు చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్నారన్న ఆయన.. రీసర్వేకు రైతులు సహకరించి, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని.. రిజిస్ర్టేషన్కు సబ్ రిజిష్ర్టార్ కార్యాలయాలు, ముటేషన్కు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదని.. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని గ్రామ సచివాలయంలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
Read Also: Vishnu Kumar Raju: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను అంగీకరించేది లేదు..!
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి ఒక్క పని కొచ్చిన కార్యక్రమం జిల్లాలో చేపట్టలేదని ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంస్థలు కుడా పెట్టించలేని దిక్కుమాలిన పరిస్థితి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిదని మండిపడ్డారు.. మేం అధికారంలోకి వచ్చాక, రూ.700 కోట్లతో ఉద్దానం కిడ్నీ ప్రభావిత ప్రాంతానికి నీరు అందించే ఏర్పాటు చేశామన్నారు.. పలాసలో 100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.. వంశాధార అంశంలో ఒడిస్సా తో మాటాడారు.. 19 టీఎంసీలతో వంశాధార రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.. రాష్ర్టానికి దూరంగా జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటాడు అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.. అసలు విశాఖలో రాజధాని ఏర్పాటైతే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అంటూ నిలదీశారు.. తొకముడిచి పాదయాత్ర ఆపేసారు.. ఇక్కడకు పాదయాత్ర వచ్చి ఉంటే తెలిసేది అని వార్నింగ్ ఇచ్చారు.. పాదయాత్ర కొనసాగితే టీడీపీకి ఉత్తరాంధ్రలో ఒక్కసీటు కూడా వచ్చిఉండేది కాదన్నారు.. టీడీపీ సాయం చేయలేదు.. చేస్తే ఓర్వలేదని.. సాయం చేస్తున్న నేతలను ఆపేస్తే పాపం తగులుతుందన్నారు.. టీడీపీని శ్రీకాకుళం జిల్లా నుంచి వెలివేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!