Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కాపులపై కేసులు పెట్టారని.. ఈ విషయాన్ని కాపులు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదు. పవన్ తాపత్రయం అంతా చంద్రబాబు కోసమే అని ఆరోపించారు. మంత్రులపై ఇష్టారాజ్యంగా పవన్ మాట్లాడుతున్నాడని.. కాపు సామాజికవర్గ నేతలే టార్గెట్గా పవన్ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.
Read Also: Gudivada Amarnath: PSPK అంటే ప్యాకేజ్స్టార్ పవన్ కళ్యాణ్
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని.. పీకలు పిసికేస్తావా అని పవన్ కళ్యాణ్ను మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎంతమంది కలిసినా జగన్ను ఎదుర్కోవడం కష్టమన్నారు. కాపు సామాజిక వర్గం అంతా పవన్ జోకర్ బ్రోకర్ చేష్టలు గమనిస్తోందన్నారు. మీటింగ్కు వచ్చే పిల్లలను అసాంఘిక శక్తులుగా తయారుచేయవద్దని మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. సంక్షేమాన్ని పవన్ తక్కువ చేసి మాట్లాడుతున్నాడని.. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి ఏడాదికి సగటున 11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. కరోనా ఉన్నా జగన్ వచ్చినప్పటి నుంచి ఏడాదికి సగటున 15వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి దాడిశెట్టి రాజా వివరించారు. చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ పెంచటం గురించి, అల్లర్లు పెంచాలని మాట్లాడుతున్నాడన్నారు. భీమ్లా నాయక్ సినిమా వల్ల 30 కోట్లు నష్టపోయానని పవన్ చెప్తున్నాడని.. సినిమా ప్రొడక్షనే రూ.20 కోట్లు దాటలేదని.. అప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని నిలదీశారు. నాసిరకం సినిమా తీసి ప్రజలు చూడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. తక్కువ బడ్జెట్లో తీసిన కాంతార సినిమా ఏ రకంగా హిట్ అయ్యిందో అందరూ చూశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబు కాపులను పవన్కు అప్పగించాడని.. ఇలాంటి శునకాలు చంద్రబాబు దగ్గర చాలానే ఉన్నాయని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ భాష అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కులాల వారీ రిజర్వేషన్లు లేనప్పుడు ఒక వర్గానికి ఎలా ఇస్తారని నిలదీశారు. కేంద్రం కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని అనుమతిస్తే ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్ధిక వెనుకబాటు అనే అంశాన్ని తీసుకుంటే కాపులకు 7 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. ఐదు శాతం రిజర్వేషన్ వల్ల కాపుల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. వైఎస్ఆర్ పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్కు లేదన్నారు. వైఎస్ఆర్ దెబ్బకు ప్రజారాజ్యం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని.. ఇప్పుడు జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!