Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Dadisetti Raja Sensational Allegations On Pawan Kalyan

Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు

Published Date :January 13, 2023 , 2:27 pm
By Ramesh Nalam
Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కాపులపై కేసులు పెట్టారని.. ఈ విషయాన్ని కాపులు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదు. పవన్ తాపత్రయం అంతా చంద్రబాబు కోసమే అని ఆరోపించారు. మంత్రులపై ఇష్టారాజ్యంగా పవన్ మాట్లాడుతున్నాడని.. కాపు సామాజికవర్గ నేతలే టార్గెట్‌గా పవన్ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.

Read Also: Gudivada Amarnath: PSPK అంటే ప్యాకేజ్‌స్టార్ పవన్ కళ్యాణ్

Also Read

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
  • Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని.. పీకలు పిసికేస్తావా అని పవన్ కళ్యాణ్‌ను మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎంతమంది కలిసినా జగన్‌ను ఎదుర్కోవడం కష్టమన్నారు. కాపు సామాజిక వర్గం అంతా పవన్ జోకర్ బ్రోకర్ చేష్టలు గమనిస్తోందన్నారు. మీటింగ్‌కు వచ్చే పిల్లలను అసాంఘిక శక్తులుగా తయారుచేయవద్దని మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. సంక్షేమాన్ని పవన్ తక్కువ చేసి మాట్లాడుతున్నాడని.. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి ఏడాదికి సగటున 11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. కరోనా ఉన్నా జగన్ వచ్చినప్పటి నుంచి ఏడాదికి సగటున 15వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి దాడిశెట్టి రాజా వివరించారు. చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ పెంచటం గురించి, అల్లర్లు పెంచాలని మాట్లాడుతున్నాడన్నారు. భీమ్లా నాయక్ సినిమా వల్ల 30 కోట్లు నష్టపోయానని పవన్ చెప్తున్నాడని.. సినిమా ప్రొడక్షనే రూ.20 కోట్లు దాటలేదని.. అప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని నిలదీశారు. నాసిరకం సినిమా తీసి ప్రజలు చూడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన కాంతార సినిమా ఏ రకంగా హిట్ అయ్యిందో అందరూ చూశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబు కాపులను పవన్‌కు అప్పగించాడని.. ఇలాంటి శునకాలు చంద్రబాబు దగ్గర చాలానే ఉన్నాయని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ భాష అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కులాల వారీ రిజర్వేషన్లు లేనప్పుడు ఒక వర్గానికి ఎలా ఇస్తారని నిలదీశారు. కేంద్రం కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని అనుమతిస్తే ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్ధిక వెనుకబాటు అనే అంశాన్ని తీసుకుంటే కాపులకు 7 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. ఐదు శాతం రిజర్వేషన్ వల్ల కాపుల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. వైఎస్ఆర్ పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. వైఎస్ఆర్ దెబ్బకు ప్రజారాజ్యం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని.. ఇప్పుడు జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Dadisetti Raja
  • JanaSena Party
  • pawan kalyan
  • YSRCP

తాజావార్తలు

  • LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్‌ఎస్‌జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!

  • Super Over Stats: సూపర్ ఓవర్‌లోని రన్స్, వికెట్లను బ్యాట్స్‌మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు

  • Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..

  • Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!

  • EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions