అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం మా విధానం: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు అవుతాయా అంటూ ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మేము ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి చెందటం మా పార్టీ విధానమని మంత్రి అన్నారు. మేము చెప్పిందే జరగాలి అనుకుంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వద్దంటున్నారని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఎవరు వచ్చి అచ్చెన్నాయుడుకు చెప్పారు? అంటూ తీవ్ర స్థాయిలో బొత్స వారిపై మండిపడ్డారు.
Also Read
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
AlSo Read: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. కోడిగుడ్లలో నాణ్యత ఏది..?
రేపటి తిరుపతి సభలో టీడీపీనే అల్లర్లు చేసుకుని మా పై నెట్టేసే కుట్ర చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పోలవరం టీడీపీకి ఏటీఎమ్ కార్డుగా మారిందని బీజేపీ చెప్పింది వాస్తవం కాదా..? అమరావతి ఒక అవినీతి కూపం అని బీజేపీనే చెప్పిందని మంత్రి అన్నారు. రేపు జరిగే తిరుపతి సభ టీడీపీ రాజకీయ సభగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. కొన్ని మీడియా సంస్థలు తాము చూపించిందే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాయి. అదే నిజమైతే వైసీపీ అధికారంలోకి రాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!