క్రెడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్ బాండ్ల జారీ.. వాటి కాల పరిమితి.. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
వీటిపై స్పందించిన మంత్రి ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోలు, రూపొందించిన మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు తీసుకు వస్తామని క్రెడాయ్ ప్రతినిధులకు చెప్పారు. అంతే కాకుండా అవసరమైనచోట్ల నిబంధనలు సవరణకు సిద్ధమని క్రెడాయ్ ప్రతినిధులకు మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.