విశాఖ సముద్ర తీరంలోని తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకుని వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎం. వీ.మాను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని నిర్ణయించారు. దీంతో పనులు జరుగుతున్న తీరును మంత్రి అవంతి పరిశీలించారు. పీపీపీ పద్ధతిలో గిల్మైరైన్ కంపెనీతో కలిసి ఈ షిప్ను రెస్టారెంట్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎం.వీమా ను డిసెంబర్ 29 నాటికి పర్యాటక ప్రదేశంగా తయారు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. విశాఖలో ఇంకా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దవల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. కాగా గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని చేయూతను అందివ్వలేదని మంత్రి పేర్కొన్నారు.