Ambati Rambabu: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు వైసీపీ నేతలు వివరించాలని ఆయన సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు ఆప్షన్లు ఉన్నాయంటారు.. మరోసారి ప్రజలతోనే పొత్తు అంటారు అంటూ చురకలు అంటించారు. రహస్య మిత్రుడు చంద్రబాబుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ను పవన్ కళ్యాణ్ ఓడించలేరని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇప్పటివరకు లక్షా యాభై వేల కోట్ల నిధులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో చేరాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
అటు మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అని కొనియాడారు. పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడానికి సచివాలయం, వాలంటరీ వ్యవస్థలను ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్నారు. ఒకటో తేదీన తెల్లవారుజామున ఐదున్నరకే లబ్ధిదారులకు పింఛను ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని మంత్రి విడదల రజినీ గుర్తుచేశారు. ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఈ పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరాయని మంత్రి విడదల రజినీ వివరించారు.
Also Read
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
తాజావార్తలు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
-
Varun Tej: రిలీజ్కు ముందే వరుణ్ తేజ్ జాక్పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!