Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చిన ఇరిగేషన్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రకరకాల ప్రచారం సాగుతోంది.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు? యథావిథంగా ఉంటుందని మరికొందరు చెబుతున్న మాట.. అయితే, పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పాడు.. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను సవాల్ చేస్తున్నాను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికపైనే చెప్పారు.. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని అని గుర్తుచేశారు.
Read Also: Margani Bharat: పవన్ 2 రోజులు కనబడితే 3 రోజులు కనిపించరు.. ఢిల్లీకి పిలిచారా? ఆయనే వెళ్లారా..?
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్లు 41.15కు ఎత్తు కుదించారన్నది పచ్చి అబద్ధం అని తిప్పికొట్టారు అంబటి రాంబాబు.. అధికారులు సంతకాలు చేశారని చేసిన తన వ్యాఖ్యలను నాదెండ్ల నిరూపిస్తే నేనే స్వయంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు తీసుకుని వెళ్తానన్నారు.. గొడవ చేయటానికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు ఎందుకు అనుమతిస్తాం? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి గొడవ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిన విషయం తెలియకే 2022 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. గతంలో ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.
కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో ప్రజలను జగన్ సర్కార్ మోసం చేస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించిన విషయం విదితమే.. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్న ఆయన.. కేవలం రాజకీయంగా బురద జల్లేందుకు ప్రాజెక్టు అంశాన్ని వాడుకుంటున్నారనే విషయం కేంద్ర మంత్రి షెకావత్తో సమావేశం సందర్భంగా తెలిసి అవాక్కయ్యామన్నారు. ఇక, త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరంలో పర్యటిస్తారని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, శాంతి భద్రతలు క్షీణించడం వంటి విషయాలను.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!