Polavaram Irrigation Project: పోలవరం నిర్మాణంపై మంత్రి అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపాటు పనికిరాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో జాప్యం కొనసాగుతూనే ఉంది.. అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల ఇచ్చిన రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతది కొనసాగించాల అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదికీలక పరిణామం. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందన్నారు. 41.17 కాంటూరు పరిధి వరకు ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయడం జరుగుతుందని.. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందేనన్నారు.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండువేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించడంలేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
నేను మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు పూర్తి చేయాలని తొందరపాటు లేదు.. ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటుతో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు మంత్రి అంబటి. మరోవైపు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.. రాయలసీమ ప్రజలు ఏమాత్రం కంగారుపడాల్సిన అవసంలేదు.. ప్రభుత్వం న్యాయపోరాటం చేయడానికి సిద్దంగా ఉంది. ఉపనధులైన తుంగ, భద్ర నుంచి 42 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణం చేయలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.. దీని వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనేది ప్రభుత్వ భావన.. జలాలు కేటాయింపు విషయంలో కృష్టవాటర్ బోర్డు, బచావత్ కమీషన్ చెప్పిందో అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఈ మధ్యే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!