Adimulapu Suresh: ప్రజలు మోసం చేసేందుకే.. చంద్రబాబు కొత్త మేనిఫెస్టో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh Fires On Chandrababu Manifesto: ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. తన హయాంలో రైతులకు రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. మహిళలను, యువతను, రైతులను టీడీపీ ప్రభుత్వం మోసి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాలను విమర్శించి, ఎగతాళి చేసిన వ్యక్తే.. ఇప్పుడు పేర్లు మార్చి, అవే పథకాలను పెడతామంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్దితిలో లేరని.. ముఖ్యంగా మహిళలు బాబును నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మాయలోళ్ల మాటలు నమ్మి, వారి గారడీలో పడొద్దని సూచించారు. మహిళలు, యువతకు తమ వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.
MP Margani Bharath: వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోంది
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
అంతకుముందు కూడా.. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్లలో ఒకరైన నివాసం ఉంటున్నారా అని నిలదీసిన ఆయన.. టిడ్కో లేఔట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా వచ్చి నివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామన్నారు. వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇచ్చామన్నారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు, టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లేఔట్ల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!