Venkaiah Naidu: ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు .. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు..
- నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది..
- మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి..
- ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు: వెంకయ్యనాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణామాలపై ప్రజలు ఆలోచన చేయాలి.. రాజకీయ నాయకుల నడవడిక, పని తీరును ప్రజలు గమనిస్తుండాలి.. ఎప్పుడూ ఆదర్శంగా, క్రమశిక్షణతో నమ్మిన సిద్దాంతం కోసం పని చేయాలని సూచించారు. జట్కా బండి పైన తిరిగి అద్వానీ, వాజ్ పాయ్ ప్రచారం చేసేవారు.. లా చదువుకుని, జన సంఘ్ పట్ల ఆకర్షితుడై, ఆ తరువాత బీజేపీ కోసం శ్రీమన్నారాయణ పని చేశారని గుర్తు చేశారు. ఎన్నికలలో పోటీ చేయకుండా, పదవులు ఆశించకుండా ఆయన పార్టీ కోసం పని చేశారు.. మన ప్రవర్తన చూసి మన పార్టీ పై నమ్మకం కలిగించాలి.. మన మాట, మన పని, మనం చేసే సాయమే నాయకుడిగా ఎదిగేలా చేస్తుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
Read Also: Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
అయితే, ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పాడిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బస్సుల రాకపోకల తరహాలో.. రాజకీయ నాయకుల రాకపోకలు అని వారి వివరాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సరైనా కారణం ఉంటేనే నాయకులు పార్టీ మారేవారు.. కానీ, ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు అని మండిపడ్డారు. ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పని చేసేవారే నిజమైన నాయకుడు.. రాజకీయ నాయకులకు సమయ పాలన కూడా ఎంతో ముఖ్యం అన్నారు.
Read Also: Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది
ఇక, నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే.. కష్టం అనేది ఉండదు.. ఎదుటి వారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుంది అని తెలిపారు. ఎవరితోనైనా స్నేహం మన కనురెప్ప లాగా ఉండాలని సూచించారు. ఎప్పుడు అవసరం వచ్చినా కనురెప్ప లాగా ఆ కష్టానికి అడ్డంగా నిలబడాలని మాజీ ఉపరాష్ట్రపతి తెలియజేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!