Margani Bharat: ప్రజలు ఏం కొన్నా ఒక్క శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి..
- సీఎం చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్..
- రాష్ట్రంలో ఒక్క శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు..
- ఐదు నెలలకు ప్రజల మీద కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేసింది: మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మళ్లీ బాబు బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. ఎస్జీ ఎస్టీపై ఒక శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించడం అంటే ఇదేనా.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే ఆయన నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. 2014- 19 పాలనకు మించి బాదుడే బాదుడు కార్యక్రమానికి పదును పెట్టారని సెటైర్ వేశారు. ఇప్పటికే కరెంట్ చార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారని మార్గాని భరత్ పేర్కొన్నారు.
Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..
Also Read
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
అలాగే, ప్రజలు ఏం కొన్నా 1 శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి అని మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. అసలు సర్ ఛార్జ్ విధింపు ఎందుకోసం? ఎవరి కోసం? అని ప్రశ్నించారు. మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? నేను సంపద సృష్టిస్తా అన్నారా? లేదా? మరి ఆ సంపద ఎక్కడుంది?.. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా?.. అసలు సర్ ఛార్జ్ రూపంలో వచ్చే డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలని అనుకుంటున్నారు? అని అడిగారు. మీరు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి?.. రూ.57 వేల కోట్లు ఏం చేశారు?.. ఎవరి జేబుల్లోకి ఆ డబ్బు వెళ్లింది? మీ ఐదారు నెలల పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క స్కీం లేదని వైసీపీ మాజీ ఎంపీ భరత్ విమర్శించారు.
Read Also: Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?
ఇక, ఒక్క పనీ లేదు.. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ డ్.. రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ. 25 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. మీరు చెప్పింది అబద్దం కాదా?.. మీరు అడుగుతున్న సర్ ఛార్జ్ ని ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని అడిగారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి పైనా ఇది భారం అవుతుంది.. ప్రజలు భరించే డబ్బులు ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని క్వశ్చన్ చేశారు.
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!