Margani Bharat: ప్రజలు ఏం కొన్నా ఒక్క శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి..
- సీఎం చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్..
- రాష్ట్రంలో ఒక్క శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు..
- ఐదు నెలలకు ప్రజల మీద కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేసింది: మార్గాని భరత్
Margani Bharat: వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మళ్లీ బాబు బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. ఎస్జీ ఎస్టీపై ఒక శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించడం అంటే ఇదేనా.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే ఆయన నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. 2014- 19 పాలనకు మించి బాదుడే బాదుడు కార్యక్రమానికి పదును పెట్టారని సెటైర్ వేశారు. ఇప్పటికే కరెంట్ చార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారని మార్గాని భరత్ పేర్కొన్నారు.
Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
అలాగే, ప్రజలు ఏం కొన్నా 1 శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి అని మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. అసలు సర్ ఛార్జ్ విధింపు ఎందుకోసం? ఎవరి కోసం? అని ప్రశ్నించారు. మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? నేను సంపద సృష్టిస్తా అన్నారా? లేదా? మరి ఆ సంపద ఎక్కడుంది?.. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా?.. అసలు సర్ ఛార్జ్ రూపంలో వచ్చే డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలని అనుకుంటున్నారు? అని అడిగారు. మీరు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి?.. రూ.57 వేల కోట్లు ఏం చేశారు?.. ఎవరి జేబుల్లోకి ఆ డబ్బు వెళ్లింది? మీ ఐదారు నెలల పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క స్కీం లేదని వైసీపీ మాజీ ఎంపీ భరత్ విమర్శించారు.
Read Also: Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?
ఇక, ఒక్క పనీ లేదు.. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ డ్.. రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ. 25 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. మీరు చెప్పింది అబద్దం కాదా?.. మీరు అడుగుతున్న సర్ ఛార్జ్ ని ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని అడిగారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి పైనా ఇది భారం అవుతుంది.. ప్రజలు భరించే డబ్బులు ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని క్వశ్చన్ చేశారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?