Bharat Bandh: రేపు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
- ఈ నెల 18, 19న జరిగిన ఎన్ కౌంటర్లలో మృతి చెందిన 13 మంది మావోయిస్టులు..
- ఎన్ కౌంటర్లకు నిరసనగా రేపు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ..
- ప్రజా ప్రతినిధులు ఏజెన్సీని విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసుల సూచనలు..
- అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో అలర్ట్ అయిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా రేపు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్కౌంటర్గా చెప్పుకున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబీ పోలీసులు అతన్ని పట్టుకుని.. 15న అరెస్ట్ చేసి, 18వ తేదీన హిడ్మాను బుటకపు ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్ ఆరోపించారు.
Read Also: Adani Group: ఆరేళ్లలో ఆరు ప్రధాన కంపెనీలను కొన్న అదానీ.. అవి ఏంటో తెలుసా!
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
అలాగే, ఛత్తీస్గఢ్కు చెందిన ఆదివాసీ సంఘం సీనియర్ నాయకుడు మనీష్ కుంజా కూడా ఈ ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించారు. తాడిమెట్ల, జీరంఘాట్ ఘటనల్లో మాద్వి హిడ్మా ప్రమేయం లేదని పేర్కొన్నారు. ఆంధ్రాకు చెందిన కొంత మంది పార్టీకి చెందిన నాయకులే హిడ్మా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ ఎన్కౌంటర్లో దేవ్జీ పాత్ర ఉందని తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రేపు (నవంబర్ 23) భారత్ బంద్కి పిలుపునివ్వడంతో.. భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజా ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతాలను విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!