Manda Krishna Madiga: బిల్లు పెట్టకపోతే మా సత్తా చూపిస్తాం.. మందకృష్ణ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga Warns Central Govt Over SC Bill: పార్లమెంటులో ఎస్సీ బిల్లు పెట్టకపోతే.. తమ సత్తా చూపిస్తామని ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ప్రకాశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా పదే పదే హామీలు ఇవ్వటం కన్నా, పార్లమెంటులో బిల్లును పెట్టాలని ప్రధాని మోడీని కోరుతున్నామన్నారు. పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఉన్నా.. బీజేపీ కేవలం మాటలకే పరిమితం అయ్యిందన్నారు. 2013లోనే బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అన్నీ రాజకీయ పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయన్నారు. వచ్చే పార్లమెంటు సమయంలో తనని కలవాలని మోడీ కబురు చేయించారన్నారు. దళితుల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు కనిపించలేదని దుయ్యబట్టారు.
Tana President: వాషింగ్టన్ డీసిలో అంబరాన్నంటిన కొడాలి నరేన్ ఆత్మీయుల కోలాహలం
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
అంతకుముందు.. వరంగల్లో ప్రధాని మోడీ పర్యటించిన సందర్భలో మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణను మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ గురించి మోడీ వద్ద మందకృష్ణ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ప్రధాని మోడీ తనకోసం ప్రత్యేక సమయం తీసుకొని కలిశారని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తనను ఎంతో ప్రేమతో హత్తుకొని ఆత్మీయంగా పలకరించారని.. ఈ భేటీలో ఆయన వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ భేటీ అయిన రెండు రోజుల తర్వాత మోడీపై మందకృష్ణ విరుచుకుపడ్డారు. సామాన్య కార్యకర్త నుండి ప్రధాని మోడీ వరకు వర్గీకరణకు అనుకూలమని చెబుతూనే.. మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ పట్ల హామీ ఇస్తూనే, పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాగే కాలయాపన చేస్తే.. బీజేపీపై నమ్మకం పెట్టుకున్న మాదిగలు విశ్వసించబోరని అసహనం వ్యక్తం చేశారు.
Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!