Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. పాఠశాలల్లో ఈ సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలు జూలై 17 మరియు 18 తేదీలలో మూసివేయనున్నట్లు.. ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు, ఈశాన్య, సౌత్ ఈస్ట్, నార్త్, నార్త్ వెస్ట్ మరియు సెంట్రల్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు DOE (నార్త్ వెస్ట్-బి, వెస్ట్-ఎ, వెస్ట్-బి, సౌత్, సౌత్ వెస్ట్-ఎ, సౌత్ వెస్ట్-బి మరియు న్యూ ఢిల్లీ) మిగిలిన అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన మరియు ప్రైవేట్ గుర్తింపు పొందినవి) సోమవారం యథావిధిగా ఓపెన్ కానున్నాయి.
Pawan Kalyan: రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్పై ఎస్పీకి ఫిర్యాదు
Also Read
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- 144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
జూలై 13నుంచి యమునా నది నీటిమట్టం పెరుగుతూనే ఉన్నందున.. జూలై 16 వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనవసర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇళ్లు కూలిపోవడం మరియు ట్రాఫిక్ జామ్లు వంటివి చాలా జరుగుతున్నాయి.
Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!
అంతేకాకుండా.. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. యమునా నది ఒడ్డున నివసిస్తున్న పేద కుటుంబాలు వరదల్లో తమ ఇళ్లు కోల్పోయాయని కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువులన్నీ పోగొట్టుకున్నారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పడుతోందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!