KRMB Decision: కృష్ణా నదిపై జలాశయాల నిర్వహణకు కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఏర్పాటైన జలాశయాల నిర్వహణకు ఓ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ జలసౌధలో ఇటీవల జరిగిన భేటీలో కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ కేఆర్ఎంబీ కీలక ప్రకటన విడుదల చేసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, రెండు రాష్ట్రాల జెన్కోలకు చెందిన వెంకటరాజం, సృజయ్ కుమార్లు నియమితులయ్యారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
కృష్ణానదికి సంబంధించి మూడు అంశాల ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, సాగర్లో విద్యుదుత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేయాలని, నెలలోగా శ్రీశైలం, సాగర్ జలాశయాల రూల్ కర్వ్ ముసాయిదా పరిశీలన జరగాలని కమిటీ సూచించింది. నదిలో 75 శాతం నీటి లభ్యతకు పైబడి వరద జలాల వినియోగానికి విధి విధానాలు రూపొందించనుంది. రెండు రాష్ట్రాలు డెడ్ స్టోరేజీకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించే విషయంలో కమిటీ విధి విధానాలు రూపొందించి కేఆర్ఎంబీకి అందచేయనుంది. మొత్తం మీద కమిటీ ద్వారా అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయని రెండురాష్ట్రాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Hyderabad : చేతివాటం పోలీసుపై సస్పెన్షన్ వేటు
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!