Lands Resurvey: భూముల రీసర్వేపై ప్రత్యేక ఫోకస్
భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు.
కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే.. వాటిని పరిష్కరించేందుకు మొబైల్ కోర్టుల ఏర్పాటు చేశాం.కోర్టులో తగాదాలు ఉన్నవి తప్ప.. మిగిలిన భూ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం.ఏడాదికి మొత్తంగా పది లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతోంటే.. గ్రామాల్లో 5 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.రెవెన్యూ రికార్డులనేవి లైవ్ రికార్డు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ప్రస్తుతమే కాకుండా.. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాని వ్యవస్థను సిద్దం చేస్తున్నాం.ఆటో మ్యూటేషన్ కోసం అవసరమైన చట్ట సవరణ చేపడుతున్నాం.ఇక నుంచి మ్యూటేషన్లు తిరస్కరించాలంటే ఆర్డీఓకి పంపాల్సిందే.ఓ సర్వేలో కొంత భాగాన్ని అమ్మాలంటే సర్వేను సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది.చుక్కల భూముల సమస్యకు పరిష్కారం తెచ్చాం.2017 నాటికి ఆర్ఓఆర్ రికార్డుల్లో పేరు ఉండడంతో పాటు.. దాని కంటే 12 ఏళ్ల పాటు కంటిన్యూగా పేరు ఉంటే.. క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం.కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియని సులభతరం చేస్తున్నాం.గతంలో దరఖాస్తుదారు.. లేదా.. అతని తండ్రి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటే.. వెంటనే ఇచ్చేస్తున్నాం.
ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా రేషన్ కార్డు ఆధారంగా జారీ చేస్తాం.ఇప్పటి వరకు 430 గ్రామాల్లో రీ-సర్వే పూర్తైంది.రీ-సర్వే చేయడం ద్వారా పొలం గట్లు జరిపేస్తామనే భ్రమలు వద్దు. రీ-సర్వేలో పొలం గట్లు జరపం.. అనుభవదారులను తప్పించం. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే నోటీసులిచ్చి.. మళ్లీ సర్వే చేపడతాం. రీ-సర్వే పూర్తైన 430 గ్రామాల్లో పెద్దగా తేడాలు ఏం రాలేదు.గతంలో చేసిన సర్వేల్లో 5 శాతం తేడాలను అనుమతించవచ్చని నిబంధనలే ఉన్నాయి. 2023 ఏడాది చివరికల్లా రీ-సర్వే కార్యక్రమం పూర్తి చేసేస్తాం అన్నారు సాయిప్రసాద్.
తాజావార్తలు
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!