Lands Resurvey: భూముల రీసర్వేపై ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు.
కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే.. వాటిని పరిష్కరించేందుకు మొబైల్ కోర్టుల ఏర్పాటు చేశాం.కోర్టులో తగాదాలు ఉన్నవి తప్ప.. మిగిలిన భూ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం.ఏడాదికి మొత్తంగా పది లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతోంటే.. గ్రామాల్లో 5 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.రెవెన్యూ రికార్డులనేవి లైవ్ రికార్డు.
Also Read
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ప్రస్తుతమే కాకుండా.. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాని వ్యవస్థను సిద్దం చేస్తున్నాం.ఆటో మ్యూటేషన్ కోసం అవసరమైన చట్ట సవరణ చేపడుతున్నాం.ఇక నుంచి మ్యూటేషన్లు తిరస్కరించాలంటే ఆర్డీఓకి పంపాల్సిందే.ఓ సర్వేలో కొంత భాగాన్ని అమ్మాలంటే సర్వేను సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది.చుక్కల భూముల సమస్యకు పరిష్కారం తెచ్చాం.2017 నాటికి ఆర్ఓఆర్ రికార్డుల్లో పేరు ఉండడంతో పాటు.. దాని కంటే 12 ఏళ్ల పాటు కంటిన్యూగా పేరు ఉంటే.. క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం.కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియని సులభతరం చేస్తున్నాం.గతంలో దరఖాస్తుదారు.. లేదా.. అతని తండ్రి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటే.. వెంటనే ఇచ్చేస్తున్నాం.
ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా రేషన్ కార్డు ఆధారంగా జారీ చేస్తాం.ఇప్పటి వరకు 430 గ్రామాల్లో రీ-సర్వే పూర్తైంది.రీ-సర్వే చేయడం ద్వారా పొలం గట్లు జరిపేస్తామనే భ్రమలు వద్దు. రీ-సర్వేలో పొలం గట్లు జరపం.. అనుభవదారులను తప్పించం. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే నోటీసులిచ్చి.. మళ్లీ సర్వే చేపడతాం. రీ-సర్వే పూర్తైన 430 గ్రామాల్లో పెద్దగా తేడాలు ఏం రాలేదు.గతంలో చేసిన సర్వేల్లో 5 శాతం తేడాలను అనుమతించవచ్చని నిబంధనలే ఉన్నాయి. 2023 ఏడాది చివరికల్లా రీ-సర్వే కార్యక్రమం పూర్తి చేసేస్తాం అన్నారు సాయిప్రసాద్.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!