Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వంలో భూకుంభకోణాలు ఎక్కువయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Scams Increased In Andhra Pradesh Says Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలు భూములపైనే ఎక్కువ దృష్టి పెట్టారని.. ఏపీలో భూ కుంభకోణాలు అధికమయ్యాయని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ భూకుంభకోణాల గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆన్లైన్లో స్థలాల పేర్లు మార్చేస్తున్నారని.. ఆన్లైన్ వ్యవస్థ ఫ్రాడ్గా తయారైందని మండిపడ్డారు. భూకుంభకోణాల్లో ఇరుక్కునేది అధికారులేనన్నారు. భూకుంభకోణాలు ప్రధాన ఆదయవనరుగా మార్చుకుంటున్నారని.. అందరూ కూడబలుక్కొని భూములు దోచేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఓర్వకల్లో జూనియర్ కాలేజీ కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించానని, ఇప్పుడు కాలేజీ భూబకాసురులు దాన్ని ఆక్రమించుకొని కేవలం రెండు ఎకరాలు మాత్రమే మిగిల్చారని పేర్కొన్నారు. ఐదు ఎకరాలకు ప్రహరిగొడ నిర్మించి భూమిని కాపాడకుంటే.. తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
అంతకుముందు ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తోన్న మద్యంపై కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో పది మద్యం బాటిళ్లు తాగినా మత్తు ఎక్కడం లేదని, కలర్ నీళ్లు కలిపి బారు షాపుల్లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎవరైనా మద్యం తాగి ఊగితే, అది ఇతర రాష్ట్రాల మందు అయ్యుంటుందే తప్ప ఏపీది కాదని ఎద్దేవా చేశారు. తండ్రి వైఎస్సార్ మంచి పేరు సంపాదిస్తే, కొడుకు జగన్ మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిలో పురుగులు పడుతున్నాయని విమర్శించారు.
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
తాజావార్తలు
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!