Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వంలో భూకుంభకోణాలు ఎక్కువయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Scams Increased In Andhra Pradesh Says Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలు భూములపైనే ఎక్కువ దృష్టి పెట్టారని.. ఏపీలో భూ కుంభకోణాలు అధికమయ్యాయని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ భూకుంభకోణాల గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆన్లైన్లో స్థలాల పేర్లు మార్చేస్తున్నారని.. ఆన్లైన్ వ్యవస్థ ఫ్రాడ్గా తయారైందని మండిపడ్డారు. భూకుంభకోణాల్లో ఇరుక్కునేది అధికారులేనన్నారు. భూకుంభకోణాలు ప్రధాన ఆదయవనరుగా మార్చుకుంటున్నారని.. అందరూ కూడబలుక్కొని భూములు దోచేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఓర్వకల్లో జూనియర్ కాలేజీ కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించానని, ఇప్పుడు కాలేజీ భూబకాసురులు దాన్ని ఆక్రమించుకొని కేవలం రెండు ఎకరాలు మాత్రమే మిగిల్చారని పేర్కొన్నారు. ఐదు ఎకరాలకు ప్రహరిగొడ నిర్మించి భూమిని కాపాడకుంటే.. తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
అంతకుముందు ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తోన్న మద్యంపై కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో పది మద్యం బాటిళ్లు తాగినా మత్తు ఎక్కడం లేదని, కలర్ నీళ్లు కలిపి బారు షాపుల్లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎవరైనా మద్యం తాగి ఊగితే, అది ఇతర రాష్ట్రాల మందు అయ్యుంటుందే తప్ప ఏపీది కాదని ఎద్దేవా చేశారు. తండ్రి వైఎస్సార్ మంచి పేరు సంపాదిస్తే, కొడుకు జగన్ మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిలో పురుగులు పడుతున్నాయని విమర్శించారు.
Also Read
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తాజావార్తలు
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!