Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Land Issue Between Mohan Babu Vidyaniketan University And Rangampeta Villagers

Mohan Babu Issue: స్థలం గొడవ.. మోహన్‌బాబు అనుచరులు హత్యకు కుట్రపన్నారన్న ఎంపీటీసీ

Published Date :June 18, 2023 , 12:13 pm
By NTV WebDesk
Mohan Babu Issue: స్థలం గొడవ.. మోహన్‌బాబు అనుచరులు హత్యకు కుట్రపన్నారన్న ఎంపీటీసీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Land Issue Between Mohan Babu Vidyaniketan University And Rangampeta Villagers: చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామస్థులు, నటుడు మోహన్ బాబు మధ్య స్థలం విషయమై వివాదం ముదురుతోంది. ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీష్‌లపై మోహన్ బాబు మనుషులు దాడికి ప్రయత్నం చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి రంగంపేటలో ఆరుగురు దుండగులు పెట్రోల్ క్యాన్‌లు, కత్తులు, కర్రలతో హల్‌చల్ చేస్తున్నారని గుర్తించిన గ్రామస్తులు.. హేమంత్ అనే ఓ యువకుడ్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డ్ స్థలం కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని.. అయితే గ్రామ సభలో తీర్మానం చేశాకే ఆ భూములు ఇస్తామని చెప్పామన్నారు. గ్రామానికి సంబంధించిన భూములు కావడంతో.. ఆ స్థలం ఇవ్వకూడదని గ్రామస్తులు తీర్మానం చేశారన్నారు.

Ice Cream: కాటేదాన్‌లో కల్తీ ఐస్ క్రీమ్.. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో నకిలీ ముఠా

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

నాగపట్నం సర్వే నెంబర్ 10/2లో 35 సెంట్లు భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహకులు కన్నేశారని బోస్ చంద్రారెడ్డి పేర్కొన్ననారు. 2023 ఫిబ్రవరిలో తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని.. గుణశేఖర్ రెడ్డి పేరుతో వివరాలు సేకరించామని తెలిపారు. అప్పటి నుంచి తమపై కక్ష పెంచుకున్నారని అన్నారు. గతంలోనే తమపై ఓసారి దాడికి ప్రయత్నించారని.. అప్పుడే తాము ఫిర్యాదు చేయాలని అనుకున్నామని.. కానీ పెద్దమనుషులు ఓపిక పట్టమని చెప్పడంతో వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ స్థలంలో ఏవో పనులు జరుగుతున్నాయని అనుమానం రావడంతో.. మరోసారి తాము గుణశేఖర్ రెడ్డి పేరుతో అదే సర్వే నంబర్‌పై సమాచార హక్కు చట్టం కింద వివరాలకు దరఖాస్తు చేశామన్నారు. దాంతో.. ఆ భూములు తమకు దక్కకుండా అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో, తమపై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!

హేమంత్ అనే ఒక వ్యక్తి మాస్క్ ధరించుకొని.. తమ ఇంటికొచ్చి కత్తి తీసి బెదిరించాడని బోస్ చంద్రారెడ్డి తెలిపారు. అయితే.. అపార్ట్‌మెంట్‌లో ఉన్న జనాభాను చూసి వెనక్కి వెళ్లిపోయాడన్నారు. అతనితో వచ్చిన కొంతమంది కారు దగ్గర కర్రలు పెట్టుకుని ఉన్నారని, అనుమానంతో తాను పైకి వెళ్లానని చెప్పారు. సునీల్ చక్రవర్తి అనే వ్యక్తి తన కారుని కాల్చేయమని చెప్పాడని.. మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్వో సతీష్ తమ ఫోటోలతో పాటు కారు ఫోటోలు పంపించమని కోరుతూ, మూడు వేల రూపాయలు అతనికి ఫోన్ పే కూడా చేశాడని పేర్కొన్నారు. తమ ఇంటిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించాని ఆరోపణలు చేశారు. తమకు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల ప్రాణహాని ఉందని.. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Mohan Babu Issue
  • Mohan Babu Rangampeta Land Issue
  • Rangampeta Villagers
  • Vidyaniketan University

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions