Minister Narayana: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జరిగిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడిస్తూ.. సీఆర్డీఏ 47వ ఆధారిటీతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగిందన్నారు. 2014- 19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి రూ. 514 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లకు సంబంధించిన టెండర్లకు సైతం సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. సీడ్ యాక్సిస్ రోడ్ లో ఆదనపు రోడ్ల టెండర్లకు కూడా సీఆర్డీఏ ఆమోదించింది.. అలాగే, నాన్ గెజిటెడ్ 9 టవర్లకు 506.67 కోట్ల రూపాయలు.. మరో 12 టవర్లకు రూ. 517 కోట్లుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపగా.. మొత్తం రూ. 1732.31 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, మంత్రివర్గ ఉపసంఘం లా యూనివర్సిటీకి 55 ఎకరాల భూ కేటాయింపులు చేసినట్లు నారాయణ చెప్పారు.
Read Also: Cabinet Meeting: భారత్-పాక్ ఉద్రిక్తత.. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..
ఇక, క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాల కోసం 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే, కోస్టల్ బ్యాంక్ కు 0.4 ఎకరాలు, ఐఆర్సీటీసీకి ఎకరం, ఇన్కమ్ టాక్స్ కి 0.78 ఎకరాల భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే, మొత్తం 7 సంస్థలకు ఈరోజు స్థలాల కేటాయింపు చేశామన్నారు. అంతకు ముందు 64 సంస్థలకు కేటాయింపులు చేయగా.. మొత్తం 71 సంస్థలకు 1050 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు.