Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- కర్నూలు బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసిన పోలీసులు..
- మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు ప్రమాదం జరిగింది: ఎర్రిస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనింది.. శివ శంకర్ స్పాట్ లో చనిపోయాడు.. నేను గాయాలతో బయట పడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే, అతడి డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది.. దీంతో బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి వెల్లడించాడు.
Read Also: Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లాలో 66 కేసులు పెట్టి రూ. 28,400 ఫైన్ వేయగా.. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 జరిమానా విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు పెట్టడంతో పాటు రూ. 2,40,000 జరిమానా వేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు పెట్టి రూ. 2,32,100 ఫైన్, కర్నూలు జిల్లాలో 14 కేసులు పెట్టి 72,050 ఫైన్ వేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ 96,000 అధికారులు కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి ఒక బస్సు సీజ్ చేయగా, అన్నమయ్య జిల్లాలో 21 కేసులు పెట్టి 6 బస్సులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేసులు పెట్టి 3 బస్సులు సీజ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 8 కేసులు పెట్టి 4 బస్సులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..