Gummanur Jayaram: స్థానిక ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తా.. వాళ్లను నామినేషన్ వేయకుండా చేయాలి..!
- గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు..
- మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసివేస్తారేమో..
- నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: మాజీ మంత్రి, గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్టణ, మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.. రేపు రాబోయే ఎన్నికలలో ప్రతి కార్యకర్త కలిసిమెలిసిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు, స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను నామినేషన్లు కూడా వేయకుండా చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
Read Also: Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
నన్ను రౌడీ అన్నారు.. కూనికోరు అన్నారు.. నేను రౌడీని కాదు.. నాది అందరినీ ప్రేమించే గుణం అన్నారు గుమ్మనూరు జయరాం.. కేసులే పెట్టాలి అనుకుంటే.. ఈ ఏడాది కాలంలో అందరిపై కేసులు పెట్టేవాళ్లం.. కానీ, మాకు అలాంటి వ్యవహారాలు చేయం అన్నారు.. అయితే, స్థానిక సంస్థల్లో పార్టీ పెట్టిన అందరు అభ్యర్థులను గెలుపించుకోవాల్సిన బాధ్యత మనది.. దయచేసి ఎవరి కాలు పట్టుకుని గుంజే ప్రయత్నం చేయొద్దు అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. కాగా, ఇప్పటికే ఓ వైపు మంత్రి నారా లోకేష్ రెడ్బుక్పై ఆరోపణలు, విమర్శలు, కామెంట్లు వినపడుతోన్న వేళ.. ఇప్పుడు గుమ్మనూరు జయరాం కూడా తానూ రెడ్బుక్ ఓపెన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చగా మారింది..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం