Kurnool Crime: మిస్టరీ వీడిన తల్లీకూతుళ్ల హత్య కేసు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
- తల్లీకూతుళ్ల హత్య కేసులో వీడిన మిస్టరీ..
- వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
Read Also: Tata Nano EV : టాటా నానో ఈవీ వచ్చేస్తుంది?.. ధర ఎంతంటే?
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
కాగా, రెండు మృతదేహాలపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి బంధువులు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సక్రప్పను తమదైన స్టైల్ లో విచారణ చేయగా.. దారుణాన్ని వెళ్లగక్కినట్టు సమాచారం. ఆడపిల్ల పుడుతుందని గర్భిణీ అయిన భార్య, కూతురును సక్రప్ప హత్య చేశారు. ఇప్పటికే ఆడపిల్ల పుట్టిందని భార్యతో నిత్యం సక్రప్ప గొడవ పడేవాడు. పెళ్లైన ఏడాదికి మగబిడ్డ పుట్టినా.. అనారోగ్యంతో శిశువు మృతి చెందాడు.. ఆ తరువాత సమీరా పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని సలీమాకు వేధింపులు మొదలయ్యాయి. మగబిడ్డ పుట్టాలని గర్భిణీ అయిన భార్యను హింసించేవాడు. అందులో భాగంగా భార్యతో గొడవపడి కర్రతో కొట్టాడు సక్రప్ప. తల్లిని కొడుతుండగా చిన్నారి సమీరా డాడీ డాడీ అంటూ అడ్డుపడింది. నిర్దాక్షిణ్యంగా ఇద్దరిని గొంతు నులిమి హత్య చేశాడు.. ఆ తర్వాత.. సలీమానే సమీరాను హత్య చేసిందని.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు.. పోలీసులు గట్టిగా విచారిస్తే తానే హత్య చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!