Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandrababu Destroyed The Projects Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy: ప్రాజెక్టులను నాశనం చేసిందే చంద్రబాబు.. మళ్లీ జగన్ పై విమర్శలా..?

Published Date :July 18, 2025 , 2:28 pm
By Chandra Shekhar Pamena
  • 16 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం సాధించారు..
  • ప్రాజెక్టుల మీద చర్చకు చంద్రబాబుతో చర్చకు మేం సిద్ధం..
  • ప్రాజెక్టులను నాశనం చేసిందే చంద్రబాబు.. మళ్లీ జగన్ పై విమర్శలా..?: గడికోట శ్రీకాంత్ రెడ్డి
Gadikota Srikanth Reddy: ప్రాజెక్టులను నాశనం చేసిందే చంద్రబాబు.. మళ్లీ జగన్ పై విమర్శలా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.. 16 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి తాను చెప్పుకునేందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించలేదు, పూర్తి చేయలేదు అని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి రాయలసీమను రతనాల సీమను చేస్తారట అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించిన తరువాత ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు.. పదేళ్లు ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదు.. హంద్రీనీవా, గాలేరు నగరిని వదిలేశారు.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.. హంద్రీనీవా ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని 1998లో జీఓ ఇచ్చారు.. హంద్రీనీవాను 40 టీఎంసీలు కాదు 5 టీఎంసీలతో తాగునీటికి చాలని జీఓ ఇచ్చారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Nagar Kurnool: శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే

Also Read

  • Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
  • Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
  • Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
  • CM Chandrababu: బాత్‌రూమ్‌ క్లీన్‌ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ.. సీఎం సంచలన వ్యాఖ్యలు..

ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఇరిగేషన్, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తి చేసి గాలేరు నగరి, హంద్రీనీవా చేపట్టాలని జీఓ తెచ్చారు.. ఐదేళ్లలో హంద్రీనీవా పూర్తి చేయడానికి వైఎస్సార్ సంకల్పించారు.. చంద్రబాబు అన్నీ తానే చేశానని చెబుతారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటారు, టల్ బిహారీ వాజపేయికి నేనే చెప్పానంటారు.. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనలతో సాగునీరు ప్రాజెక్టులు చేపట్టారు.. చంద్రబాబు పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం రూ. 90 కోట్లు ఖర్చు పెడతానంటారు.. రాజశేఖర్ రెడ్డి అనుమతులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించారా.. సంకల్పంతో వైఎస్సార్ ప్రాజెక్టులు నిర్మించి అనుమతులు తెచ్చారు.. పోలవరంపై ఉద్యమం చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారు అని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Read Also: HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే

అయితే, ప్రాజెక్టులను నాశనం చేసిన చంద్రబాబు.. మళ్లీ జగన్ ను విమర్శిస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఉంటే ఏమౌతుంది.. కర్నూలు నుంచి హైకోర్టు, లా యూనివర్సిటీని తరలించుకుపోయారు.. హైకోర్టు వస్తే ఏమోస్తుంది.. టైప్ మిషన్లు వస్తాయని చంద్రబాబు అన్నారు.. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టినట్టు, ఎవరో చేసిన ప్రాజెక్టులు తను చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారు.. చంద్రబాబు చిత్తశుద్ధి, ద్రోహం గురించి ప్రజలు ఆలోచించాలి.. పోలవరం ప్రాజెక్టును తగ్గించడం నుంచి డైవర్ట్ చేయడానికి బనకచర్ల పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఏమి సాధించారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • Gadikota Srikanth Reddy
  • tdp
  • ys jagan

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions