Gadikota Srikanth Reddy: ప్రాజెక్టులను నాశనం చేసిందే చంద్రబాబు.. మళ్లీ జగన్ పై విమర్శలా..?
- 16 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం సాధించారు..
- ప్రాజెక్టుల మీద చర్చకు చంద్రబాబుతో చర్చకు మేం సిద్ధం..
- ప్రాజెక్టులను నాశనం చేసిందే చంద్రబాబు.. మళ్లీ జగన్ పై విమర్శలా..?: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.. 16 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి తాను చెప్పుకునేందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించలేదు, పూర్తి చేయలేదు అని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి రాయలసీమను రతనాల సీమను చేస్తారట అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించిన తరువాత ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు.. పదేళ్లు ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదు.. హంద్రీనీవా, గాలేరు నగరిని వదిలేశారు.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.. హంద్రీనీవా ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని 1998లో జీఓ ఇచ్చారు.. హంద్రీనీవాను 40 టీఎంసీలు కాదు 5 టీఎంసీలతో తాగునీటికి చాలని జీఓ ఇచ్చారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Nagar Kurnool: శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఇరిగేషన్, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తి చేసి గాలేరు నగరి, హంద్రీనీవా చేపట్టాలని జీఓ తెచ్చారు.. ఐదేళ్లలో హంద్రీనీవా పూర్తి చేయడానికి వైఎస్సార్ సంకల్పించారు.. చంద్రబాబు అన్నీ తానే చేశానని చెబుతారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటారు, టల్ బిహారీ వాజపేయికి నేనే చెప్పానంటారు.. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనలతో సాగునీరు ప్రాజెక్టులు చేపట్టారు.. చంద్రబాబు పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం రూ. 90 కోట్లు ఖర్చు పెడతానంటారు.. రాజశేఖర్ రెడ్డి అనుమతులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించారా.. సంకల్పంతో వైఎస్సార్ ప్రాజెక్టులు నిర్మించి అనుమతులు తెచ్చారు.. పోలవరంపై ఉద్యమం చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారు అని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Read Also: HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే
అయితే, ప్రాజెక్టులను నాశనం చేసిన చంద్రబాబు.. మళ్లీ జగన్ ను విమర్శిస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఉంటే ఏమౌతుంది.. కర్నూలు నుంచి హైకోర్టు, లా యూనివర్సిటీని తరలించుకుపోయారు.. హైకోర్టు వస్తే ఏమోస్తుంది.. టైప్ మిషన్లు వస్తాయని చంద్రబాబు అన్నారు.. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టినట్టు, ఎవరో చేసిన ప్రాజెక్టులు తను చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారు.. చంద్రబాబు చిత్తశుద్ధి, ద్రోహం గురించి ప్రజలు ఆలోచించాలి.. పోలవరం ప్రాజెక్టును తగ్గించడం నుంచి డైవర్ట్ చేయడానికి బనకచర్ల పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఏమి సాధించారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..