CM Chandrababu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే.. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆదా..
- సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే ..
- రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయి..
- కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో చంద్రబాబు..
- 21వ శతాబ్దం మోడీదే అవుతుందనడంలో సందేహం లేదు..
- సరైన సమయంలో మోడీ.. దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandranaidu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలందరూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.. మీరు జీఎస్టీ 2.0తో లబ్ధి పొందుతున్నారా? లేదా? చెప్పాలంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించి.. లబ్ధిపొందినవారు చప్పట్లు కొట్టాలంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు..
Read Also: JFK Assassination Documents: ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బ..
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
అయితే, సూపర్ సేవింగ్స్ అనేది ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. 25 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ.. సీఎంగా, పీఎంగా ప్రజా సేవలో ఉన్నారు. 21వ శతాబ్దం మోడీదే అవుతుందనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.. ఇక, సరైన సమయంలో ప్రధాని మోడీ.. దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇలాంటి నాయకుడు ఉండటం దేశం అదృష్టంగా అభివర్ణించారు.. చాలా మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు.. కానీ, నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని నేను చూడలేదని.. ఆయన విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు చంద్రబాబు..
ఇక, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. నరేంద్ర మోడీ దృఢ సంకల్పంతో మనం 11వ స్థానం నుండి నాల్గో స్థానానికి ఎదిగామన్నారు.. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ మన సైనిక బలాన్ని నిరూపించింది.. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభా వేదికగా చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!