Farmer Got Diamond: రైతు పంట పండింది.. రూ.2 కోట్ల వజ్రం దొరికింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Got Diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో టమోటా పంటను పండించాడు. ఈ సందర్భంగా చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు. ఈ వజ్రంతోతన కష్టాలు తీరిపోయాయని రైతు సంబరపడిపోయాడు. ఈ నేపథ్యంలో పెరవలి, జొన్నగిరికి చెందిన కొందరు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతును సంప్రదించి రూ.రెండు కోట్ల విలువైన వజ్రాన్ని రహస్యంగా రూ.35లక్షలకు కొనుగోలు చేశారు.
Read Also: Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
కాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి ఏటా తొలకరి తర్వాత వజ్రాల వేట ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పంట పొలాల్లో వజ్రాలు లభిస్తుంటాయి. ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాలు పొలాల్లో పైకి లేస్తున్నాయి.అదృష్టం రూపంలో విలువైన వజ్రం ఆ రైతు తలుపు తట్టడంతో రాత్రికి రాత్రే ఆయన ధనవంతుడిగా మారిపోయాడు. అటు కర్నూలు జిల్లా ఆదోనితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఎర్రగుడి,జొన్నగిరి, పెరవలి,తుగ్గలి, గిరిగెట్ల, మద్దికెర, పగిడిరాయి, బసినేపల్లి, అగ్రహారం, రాతన కొత్తూరు, గిరిగెట్ల, అమినాబాద్, రాతన గ్రామాలు వజ్రాల వేట జరుగుతోంది. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సీజన్లో స్థానికులు ఆశతో వజ్రాల కోసం గాలింపులు చేపడుతుంటారు. ఒకవేళ అదృష్ట లక్ష్మీ తలుపు తడితే వాళ్ల సంతోషానికి హద్దే ఉండదు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!