Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి బందరు పోర్టును ప్రారంభిస్తాం..
- కృష్ణా జిల్లా: బందరు పోర్టును సందర్శిస్తోన్న సీఎం చంద్రబాబు..
- ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చి నాటికి బందరు పోర్టును ప్రారంభిస్తాం- సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: బందరు పోర్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతికి దగ్గరగా బందరు పోర్టు ఉంటుంది.. బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది.. ఇసుక కొరత ఉందని చెప్పారు.. ఫాస్ట్ ట్రాక్ లో ఇవ్వాలని చెప్పాం.. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయి.. అనేక అవకాశాలు పరిశీలించి వాటిని ప్రోత్సహిస్తాం.. మంచి పోర్టుగా అభివృద్ధి చేసి చూపుతామని సీఎం చెప్పారు. అలాగే, మచిలీపట్నం అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. గతంలో నేనే ఈ ప్రాజెక్టును ప్రారంభించా.. మళ్లీ వాళ్లు మొదలు పెట్టి పనులు ఆపేశారు.. ఈసారి బందరు పోర్ట్ పూర్తి చేసి చూపుతాం.. ఎంతో మంది ఈ బందరు పోర్టు కోసం పెద్ద ఉద్యమాలు చేశారు.. నాలుగు బెర్తులు ఉన్నాయి.. పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదు అని చంద్రబాబు అన్నారు.
Read Also: Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్ మీడియాలో కథనాలు
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
అలాగే, అవసరమైతే భూసమీకరణ మళ్లీ చేపడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బందరు పోర్టు, రైల్వే లైన్, జాతీయ రహదారిలతో మచిలీపట్నం రూపు రేఖలు మారిపోతాయి..
ఇవాళ బందరులో నా పర్యటనలో రోడ్లపై చెత్త పేరుకుపోయి వుండటాన్ని గమనించాను.. గత పాలకులు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేర్చారు.. వీటిని ప్రక్షాళన చేయాలంటే రెండు మూడేళ్లు పడుతుంది.. త్వరలోనే వ్యవస్థలను గాడిలోపెడతాం.. ఇప్పుడు బందరు పోర్ట్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశామని ఆయన తెలిపారు. పీపీపీ మోడల్ లో ప్రాజెక్టు పూర్తి కావాలి..
2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Pemmasani Chandrasekhar: గుంటూరు నగరాన్ని క్లీన్సిటీగా చేసేందుకు కృషి చేయాలి..
ఇక, బందరు పోర్టులో రూ. 885 కోట్ల పనులు మాత్రమే అయ్యాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. పోర్టు డెవలపరుని పిలిచి డెడ్ లైన్ పెడతా.. డెడ్ లైనులోపు పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయి.. ప్రాజెక్టుకు 36.30 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది.. కలెక్టరుకు చెప్పాం.. 3696 ఎకరాలు పోర్టు ఫైనల్ ప్రాజెక్టుకు అవసరం.. ఇది పూర్తైతే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది.. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుంది.. వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటాం.. ఆంద్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుంది అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!