Mining Mafia: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు..!
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా..
- కైకలూరు, ముదినేపల్లిలో బుసక ఇతర ప్రాంతాలకు తరలింపు..
- పెనమలూరులో రాత్రి వేళల్లో టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mining Mafia: ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తూ మైనింగ్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ప్రభుత్వం నుంచి మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే.. ఒక హెక్టార్ కి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలి. ఇవేమీ చెల్లించకుండానే లారీలు, ట్రాక్టర్లతో బుసక తరలించుకు పోతుంటే మైనింగ్ శాఖ ఇటువైపు చూడని పరిస్థితి ఉంది. మరోవైపు పరిమితికి మించి లారీ, టిప్పర్లో బుసకను లోడు చేయటం, అతివేగంగా నడపటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా చేసేంది అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే కావటంతో అడ్డుకునే వారు లేకుండా పోయారు.
Read Also: Nizamabad: పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
పెనమలూరులో రాత్రి వేళల్లో టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అటు తోట్లవల్లూరు, రొయ్యూరులో అనుమతులు ముగిసినా కూడా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. మైనింగ్ను గుర్తించటానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చే సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. తనిఖీలు ముగిసిన తర్వాత మళ్లీ మైనింగే చేస్తున్నారు అక్రమార్కులు. ఇబ్రహీంపట్నంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఫెర్రీ ఇసుక రేవులో గత కొన్ని రోజులుగా ఇసుక రవాణా జరుగుతోంది. దీనిపై వరుస ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టక తప్పలేదు. మొత్తం 23 ట్రాక్టర్ లను సీజ్ చేశారు.. రెడ్డిగూడెం మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు చెరువులు పూడికతీత పేరుతో మూడు అడుగులు తీయమంటే పది నుంచి 15 అడుగుల వరకు తవ్వి అమ్ముకుంటున్న పరిస్థితి. ఇక మచిలీపట్నంలో బీచ్ శాండ్ను నిబంధనలను విరుద్ధంగా తవ్వేస్తున్నారు. వీటన్నింటికి కర్మ కర్త క్రియ అధికార పార్టీ నేతల అనుచరులు కావటంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం. స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవటంతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతోంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!