Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..
- హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
- బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని..,
- పాట వద్దన్నందుకు నేను అతనికి పాట రాయడం మానేసా- అనంత శ్రీరామ్
- హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి- అనంత శ్రీరామ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు. తాను లక్ష్యం సినిమాకు 12 నిమిషాల హిందూ పాట రాశాను.. లక్ష్యం కథ లాంటి కథ వస్తే మరల అలా పాటలు రాస్తానని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు.. అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. సత్యవాణిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు.. ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ధర్మరాజు అంతటి దాత అని కర్ణుడిని అంటే ఊరుకుంటారా.. అని అన్నారు. అందంగా ఉండటానికి చిత్రీకరణలో హైందవ హననాలు సినిమాలో జరిగాయని అనంత శ్రీరామ్ తెలిపారు. ఇస్కాన్ హరేకృష్ణ హరేకృష్ణను ఐటెం సాంగ్ చేసారు.. పీకే సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు… ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా.. అని అన్నారు. ఇన్ని విధాలుగా హననం చేస్తుంటే.. చూస్తూ కూచుంటారా.. తిరగబతారా… అని ప్రశ్నించారు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
వర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు రకాలుగా హిందువులు ఏపీలో నలిపివేయబడుతున్నారని అన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తే మతిస్థిమితం లేని వాడి చర్యలు అంటున్నారు.. హిందూ సమాజం ఏదో ఒక రోజు మతిస్థిమితం కోల్పోతేనే ఏపీలో హిందూ గౌరవం నిలబడుతుందని తెలిపారు. హిందూ సమాజం ఏకీకృతం కావాలి.. మతిస్థిమితం లేని వాళ్ళు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే మనకు అమ్మవారు పూనతారన్నారు. దేవ దేవతలు అందరూ హిందువులపై ఒంటిమీదకు వస్తారని చెప్పారు. ఈ విషయం అర్ధమైతే హిందూ వ్యవస్ధలపై దాడులు జరగవు.. కేసులు ఉండవుని వర్రే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీ చోట హిందూ జట్టు తయారు కావాలి.. ఏ పోలీసు స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి జట్టుగా మారాలని అన్నారు.
Read Also: Triptii Dimri: అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో: “యానిమల్” నటి
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..