Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..
- హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
- బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని..,
- పాట వద్దన్నందుకు నేను అతనికి పాట రాయడం మానేసా- అనంత శ్రీరామ్
- హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి- అనంత శ్రీరామ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు. తాను లక్ష్యం సినిమాకు 12 నిమిషాల హిందూ పాట రాశాను.. లక్ష్యం కథ లాంటి కథ వస్తే మరల అలా పాటలు రాస్తానని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు.. అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. సత్యవాణిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు.. ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ధర్మరాజు అంతటి దాత అని కర్ణుడిని అంటే ఊరుకుంటారా.. అని అన్నారు. అందంగా ఉండటానికి చిత్రీకరణలో హైందవ హననాలు సినిమాలో జరిగాయని అనంత శ్రీరామ్ తెలిపారు. ఇస్కాన్ హరేకృష్ణ హరేకృష్ణను ఐటెం సాంగ్ చేసారు.. పీకే సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు… ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా.. అని అన్నారు. ఇన్ని విధాలుగా హననం చేస్తుంటే.. చూస్తూ కూచుంటారా.. తిరగబతారా… అని ప్రశ్నించారు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
వర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు రకాలుగా హిందువులు ఏపీలో నలిపివేయబడుతున్నారని అన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తే మతిస్థిమితం లేని వాడి చర్యలు అంటున్నారు.. హిందూ సమాజం ఏదో ఒక రోజు మతిస్థిమితం కోల్పోతేనే ఏపీలో హిందూ గౌరవం నిలబడుతుందని తెలిపారు. హిందూ సమాజం ఏకీకృతం కావాలి.. మతిస్థిమితం లేని వాళ్ళు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే మనకు అమ్మవారు పూనతారన్నారు. దేవ దేవతలు అందరూ హిందువులపై ఒంటిమీదకు వస్తారని చెప్పారు. ఈ విషయం అర్ధమైతే హిందూ వ్యవస్ధలపై దాడులు జరగవు.. కేసులు ఉండవుని వర్రే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీ చోట హిందూ జట్టు తయారు కావాలి.. ఏ పోలీసు స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి జట్టుగా మారాలని అన్నారు.
Read Also: Triptii Dimri: అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో: “యానిమల్” నటి
తాజావార్తలు
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!