Kottu Satyanarayana: శ్రీశైలంలో చౌల్ట్రీలపై దేవస్థానానిదే అజమాయిషీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల దేవస్థాన పరిధిలోని వివిధ కులాల చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండేలా ఓ విధానం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రూముల కేటాయింపులు మొదలుకుని చౌల్ట్రీల్లో అందించే సేవల వివరాలను దేవస్థానానికి తెలిపేలా చర్యలు తీసుకుంటాం.రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్ఖానమే కల్పిస్తోందన్నారు. ఆ మేరకు చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండాలని భావిస్తున్నాం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు.
ఓ ఎమ్మెల్యే లోపల దర్శనం చేసుకుంటున్నారని ముత్యాల నాయుడు కాసేపు ఆగారు. అద్భుతమైన దర్శనం జరిగిందని బూడి ముత్యాల నాయుడు నాతో చెప్పారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అభివృద్ది చేయాలంటే అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలం అభివృద్ధికి అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఇబ్బందుల పరిష్కారంపై మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో సమావేశం అయ్యాం. శ్రీశైలం దేవస్థానం నుంచి ఏడు చదరపు మైళ్ల మేర భూమిని దేవస్థానానికి కేటాయించారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
Read Also: Rohit Sharma: రో‘హిట్’.. ధోనీ రికార్డ్ బ్రేక్
దాదాపు 4130 ఎకరాల భూమి ఏడు చదరపు మైళ్ల పరిధిలో ఉంటుంది. అలాగే ఇంకొంత భూమిని వివిధ జీవోల ద్వారా భూమిని దేవస్థానానికి కేటాయించారు. అయితే సరిహద్దులు ఫిక్స్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గతంలోని జీవోల ప్రకారం బౌండరీలు ఫిక్స్ చేయడానికి నిర్ణయించాం. అక్టోబర్ నెలాఖరు నాటికి బౌండరీలు ఫిక్స్ చేయనున్నాం అని చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఎంత భూమి కావాలో నిర్ధారించుకుంటాం. అలాగే ఎకో టూరిజం, రెలిజియస్ టూరిజం అభివృద్ధి చేస్తాం అన్నారు.
వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, రిజర్వ్ ఫారెస్టుకు ఇబ్బంది కలగకుండా శ్రీశైల దేవస్థాన అభివృద్ధి చేపడతాం. శ్రీశైల దేవస్థానాన్ని.. దేవస్థాన పరిధిలోని భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదన్నారు. దేవస్థాన అభివృద్ధికి అటవీ భూమి అవసరమైతే.. రెండింతల మేర దేవస్థాన భూమిని అటవీ శాఖకు బదలాయించే నిబంధన పైన చర్చిస్తున్నాం అని వివరించారు కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!