Konaseema Farmers: మంత్రి విశ్వరూప్ పై రైతు పరిరక్షణ సమితి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. క్రాప్ హాలీడేకి సిద్ధమవుతున్న రైతుల ఆలోచన ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మంత్రి విశ్వరూప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలీడే రైతులపై రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన ఆరోపణలను కోనసీమ రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండించింది సమితి ప్రతినిధులు మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు.
క్రాప్ హాలీడే రైతులు టీడీపీ కి చెందిన వారని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. మంత్రి గారు తమ ఇంటిలిజెన్స్ శాఖ వారిని పంపి ఇక్కడ ఏ రైతులు ఉన్నారో పరిశీలించు కోవచ్చన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని తొలకరి పంట గిట్టుబాటుకాక క్రాప్ హాలీడే పాటిస్తున్నామని తెలిపారు. రైతులకు పార్టీలు ఉండవని సాగు సమస్యలపై తామంతా కలసి పోరాడుతున్నామని పేర్కొన్నారు. రైతులలో అన్ని పార్టీల సానుభూతి పరులు ఉన్నారని…గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతులను కనీసం సమావేశాలు కూడా పెట్టుకోనివ్వకుండా ఆంక్షలు విధించిందని వారు గుర్తు చేశారు. తొలకరి పంట నష్టం ఎలా వస్తోందో తెలుసుకోవాలంటే ప్రభుత్వమే స్వయంగా తమ అధికారులతో ఒక 10 ఎకరాలలో సాగు చేయించాలని కోరారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
తొలకరి పంట గిట్టుబాటు కాక స్వచ్చందంగా తాము పంట విరామం పాటిస్తున్నామని… వచ్చే రబీలో వరి పంట సాగు చేస్తామని కోనసీమ రైతు పరిరక్షణ సమితి నేత దామిశెట్టి చంటి, రాంబాల బోసు అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యల్ని పట్టించుకోవడం లేదని కోనసీమ రైతు పరిరక్షణ సమితి, ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, రైతు ప్రతినిధులు అంటున్నారు. వరిసాగు గిట్టుబాటు కాక 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి అందరి దృష్టిలో పడ్డారు. అప్పట్లో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. మళ్ళీ ఇప్పుడు క్రాప్ హాలీడే అంశంపై రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!