Kethireddy Pedda Reddy: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివాదం.. చంద్రబాబు దృష్టిలో పడేందుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Pedda Reddy On JC Diwakar Reddy Over Traffic Police Station: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విషయమై ఖాకీ vs ఖద్దర్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! మున్సిపల్ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలని డీఎస్సీ చైతన్య తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ ఛైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మున్సిపల్ స్థలంలో స్టేషన్ కట్టొద్దని డిమాండ్ చేస్తోన్న ఆయన.. మున్సిపాల్టీ స్థలంలో కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీస్తున్నారు.
ఇలా తాడిపత్రిలో నెలకొన్న హై టెన్షన్ వాతావరణంలోనే.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తోన్న స్థలం మున్సిపాలిటీది కాదని అందరికీ తెలుసన్నారు. తాను వైసీపీతో పోరాడుతున్నానని చెప్పుకునేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నిర్వహించిన సర్వేల్లో కూడా జేసీ గెలవడని తెలిసిందని, చంద్రబాబు దృష్టిలో పడేందుకే ఈ వివాదం సృష్టిస్తున్నారని అన్నారు.
Also Read
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
గతంలో పోలీస్ స్టేషన్కి తాళాలు వేసి ఆందోళన చేశారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే జేసీ మున్సిపల్ ఛైర్మన్ అయ్యారని పెద్దారెడ్డి చెప్పారు. కాగా.. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!