Adapa Seshu: చంద్రబాబు కోసం పవన్ ముసుగు యాత్రలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapu Corporation Chairman Adapa Seshu Sensational Comments On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై ఏపీ కాపు కార్మొరేషన్ ఛైర్మన్ అడపా శేషు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ ముసుగు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖంలో ఆనందం చూడటం కోసమే పవన్ పోరాటమని చురకలంటించారు. ప్రజల్లో సీఎం జగన్కి ఉన్న ఆదరణ చూసి.. పవన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. సీఎం జగన్ అంటే.. పవన్, చంద్రబాబు వణికిపోతున్నారని పేర్కొన్నారు. పవన్ పూటకో మాట, ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
పవన్ కళ్యాణ్కు కావాల్సింది కేవలం చంద్రబాబు మాత్రమేనని, జనసేన కార్యకర్తలు కాదని అడపా శేషు వ్యాఖ్యానించారు. అసలు పవన్ ఏం మాట్లాడుతున్నారో, ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. అది పవన్కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాలు పవన్కు కనిపించలేదా? అని నిలదీశారు. జనసేన పార్టీకి ఓ సిద్ధాంతం, విధానమంటూ ఏమీ లేవని కౌంటర్ వేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. ఆయనలో పాలనలో జరిగిన అవినీతి గురించి పవన్ ఏనాడైనా ప్రశ్నించారా? అని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి ఇసుక దోచుకుంటున్నారంటూ పవన్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Robber Bride: పెళ్లై 5 రోజులు కాలేదు.. అత్తగారింటికి కన్నం వేసిన కొత్త పెళ్లికూతుర్లు..
అంతకుముందు కూడా.. కాపులను మోసం చేయడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించాడని అడపా శేషు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన రూట్లోనే పవన్ యాత్ర సాగుతుందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమంపై కేసులు పెడితే.. పవన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు ఓట్లను చంద్రబాబు దరిచేర్చడానికే పవన్ పనిచేస్తున్నాడని, కాపులంతా ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. 2014లో పవన్ని చూసి టీడీపీకి ఓట్లేస్తే.. ప్రజలకు మీరేం చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్ని ఎదుర్కేలేకే.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. అసలు పవన్ ఆలోచన ఏమిటో? కాపులకు ఆయన ఏం చేస్తారో చెప్పాలని కోరారు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?