Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishing Ban: సముద్ర జీవుల సంతానోత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రతి ఏడాది అమలు చేసే వేట నిషేధం ఈ ఏడాది కూడా నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కాకినాడ జిల్లాలో ఈ నిషేధం జూన్ 14 వరకు కొనసాగనున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఐదు మండలాలకు విస్తరించిన 68 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సుమారు 25 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు. వేట నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని వందలాది బోట్లు తీరానికే పరిమితం కానున్నాయి.
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో 478 మెకనైజ్డ్ బోట్లు, 3,904 మోటారైజ్డ్ బోట్లు, 386 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. నిషేధ కాలంలో ఇవన్నీ సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లోనే నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుంటున్నారు. వేట నిషేధాన్ని ఉల్లంఘించి సముద్రంలోకి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు బోటును స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశముందని స్పష్టం చేశారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో అర్హ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. సముద్ర సంపద పరిరక్షణ, చేపల వనరుల పెంపు, భవిష్యత్తులో మత్స్యకారులకు మెరుగైన ఆదాయం లక్ష్యంగా ఈ నిషేధాన్ని ప్రతి సంవత్సరం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!