SVSN Varma: నేను పిఠాపురంలోనే పుట్టా.. పిఠాపురంలోనే పెరిగా.. ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..? వర్మ హాట్ కామెంట్స్..
- నియోజకవర్గ మార్పుపై స్పందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ..
- నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను..
- ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SVSN Varma: గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) వార్తల్లో నిలిచారు.. మొదట సీటు కోసం పట్టుబట్టిన ఆయన.. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు.. ఇక, పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. అయితే, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.. ఇప్పుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు శర్మ.. నియోజకవర్గ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటుగా స్పందించారు. తాను పిఠాపురాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: Toxic Movie Teaser: ‘టాక్సిక్’ టీజర్కు సర్టిఫికేట్ అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను. సొంత ఊరు వదిలి ఎవడైనా వెళ్లిపోతారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం తనకు కేవలం రాజకీయ నియోజకవర్గం మాత్రమే కాదని, తన జీవితం, తన ఊరని పేర్కొన్నారు.. అయితే, పార్టీ అవసరాల మేరకు వేరే బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి పని పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరైన పిఠాపురానికి వస్తానని స్పష్టం చేశారు. పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తించడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన ఆయన.. కానీ, పిఠాపురాన్ని మాత్రం ఎప్పటికీ వదలబోనని తెగేసి చెప్పారు.. అయితే, వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఇక, వైఎస్ జగన్ రెడ్డి అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వర్మ.. ఇద్దరు ఉండే జగన్ కుటుంబానికి వేల ఎకరాలు..? ఐదు కోట్ల ప్రజలకు రాజధాని వద్దా ? అని నిలదీశారు.. జగన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు ఉండడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో లక్ష చదరపు అడుగులు, బెంగళూరులో ప్యాలస్ 30 ఎకరాలు, తాడేపల్లి ప్యాలస్ 87,120 చదరపు అడుగులు, కడపలో రాజ్ భవన్ 10 ఎకరాలు, ఇడుపుల పాయలో 350 ఎకరాలు, చెన్నైలో ప్యాలస్ 8 ఎకరాలు, ముంబాయి ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు, ఇద్దరు సభ్యులు ఉండే జగన్మోహన్ రెడ్డికి ఐదు వందల ఎకరాల పైగా విలాసవంతమైన భవనాలు ప్యాలస్ లు ఉండాలి.. కానీ, కోట్లాది మంది ప్రజలకు అవసరమయ్యే రాజధాని మాత్రం విశాలంగా ఉండకూడదా జగన్ ? అంటూ నిలదీశారు వర్మ..
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?