Woman Constable Jayasanthi: ట్రాఫిక్ క్లియర్ చేసి అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్.. తీవ్ర వివాదం..!
- వివాదంగా మారిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం..
- గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన కానిస్టేబుల్..
- కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి..
- తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ..
- విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేసిన విద్యాశాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Constable Jayasanthi: రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్ క్లియర్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో.. ఆమె వైరల్గా మారిపోయింది.. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు.. అంతేకాదు.. హోం మంత్రి అనిత.. ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు.. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో దుమారమే రేగుతోంది..
Read Also: Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి.. కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది.. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో.. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి, ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలిచారు.. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు.. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి.. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత.. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో.. ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..