Annavaram temple: అన్నవరం ఆలయానికి వచ్చే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..!
- అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..
- ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి నెయ్యి సరఫరా..
- సింహాచలం దేవస్థానానికి కూడా రైతు డైరీ నుంచే నెయ్యి..
- రెండు ఆలయాలకు ఇచ్చే నెయ్యి ధరల్లో తేడా..
Annavaram temple: తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మిగతా ఆలయాలకు సరఫరా చేసే నెయ్యిపై కూడా దృష్టి పెట్టింది.. కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయం అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ… రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది? అనే విషయంపై ఆరా తీస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అన్నవరంలో ఏడాదికి లక్ష కేజీలకు పైగా నెయ్యి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, తిరుమలకు వచ్చే నెయ్యి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన వేళ.. అన్నవరం.. ఆ తర్వాత సింహాచలం నెయ్యిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Punjab Govt: నేడు పంజాబ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
Also Read
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
- Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
కాగా, అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు దక్కిన విషయం విదితమే.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు.. 150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. ఇప్పుడు తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి వ్యవహారం టాపిక్గా మారగా.. ఇప్పుడు అన్నవరంపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్..
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!