Annavaram temple: అన్నవరం ఆలయానికి వచ్చే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..!
- అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..
- ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి నెయ్యి సరఫరా..
- సింహాచలం దేవస్థానానికి కూడా రైతు డైరీ నుంచే నెయ్యి..
- రెండు ఆలయాలకు ఇచ్చే నెయ్యి ధరల్లో తేడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annavaram temple: తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మిగతా ఆలయాలకు సరఫరా చేసే నెయ్యిపై కూడా దృష్టి పెట్టింది.. కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయం అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ… రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది? అనే విషయంపై ఆరా తీస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అన్నవరంలో ఏడాదికి లక్ష కేజీలకు పైగా నెయ్యి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, తిరుమలకు వచ్చే నెయ్యి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన వేళ.. అన్నవరం.. ఆ తర్వాత సింహాచలం నెయ్యిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Punjab Govt: నేడు పంజాబ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
కాగా, అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు దక్కిన విషయం విదితమే.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు.. 150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. ఇప్పుడు తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి వ్యవహారం టాపిక్గా మారగా.. ఇప్పుడు అన్నవరంపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్..
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!