Kakani Govardhan Reddy: సీబీఐ ఎంక్వైరీ వేసి దోషుల్ని తేల్చండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు మంత్రి కాకాణి.
మీకేమన్నా దీనిపై సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. మంత్రి పదవి హోదా కాదు, కేవలం బాధ్యత మాత్రమే, గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా సహకారం ఉండాలి. జిల్లా పార్టీలో సమస్యలు ఉన్నాయి అనేదానికంటే ఎక్కువ చూపిస్తున్నారు అనిపిస్తుంది. మా అందరి లక్ష్యం 2024లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని మీట్ ది ప్రెస్లో మంత్రి కాకాణి అభిప్రాయపడ్డారు.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
చిన్న చిన్న తొందరపాట్లు జరిగి ఉంటాయి తప్ప ఎక్కడా సమస్య లేదు. నాకు రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ అన్నారు, దాంట్లో తప్పు ఏముంది? వివాదాస్పద వ్యాఖ్యల గురించి బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చించకూడదు. పండించడం, రైతులకు సహకారం అందించడం వ్యవసాయ శాఖ బాధ్యత. మిల్లర్లతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అలా మాట్లాడితే రైతులకు సమస్య ఉంటుంది. గిట్టుబాటు ధర అంశంలో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఇద్దరి మధ్య విబేధాలని మరింత పెంచేందుకు కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారు.
Read Also: Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరు, అనిల్ ఫ్లెక్సీలు నేను చించను, నా ఫ్లెక్సీలు ఆయన చించరు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్ని పరిష్కారం జరిపేలా అందరిని కలుపుకుని ముందుకెళ్తామన్నారు మంత్రి కాకాణి. అధికార పార్టీపై బురదజల్లేందుకే పవన్ కళ్యాణ్ యాత్ర చేపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నటనకు సరిపోతారు, రాజకీయాల్లో పనికిరాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..