Kakani Govardhan Reddy: సీబీఐ ఎంక్వైరీ వేసి దోషుల్ని తేల్చండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు మంత్రి కాకాణి.
మీకేమన్నా దీనిపై సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. మంత్రి పదవి హోదా కాదు, కేవలం బాధ్యత మాత్రమే, గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా సహకారం ఉండాలి. జిల్లా పార్టీలో సమస్యలు ఉన్నాయి అనేదానికంటే ఎక్కువ చూపిస్తున్నారు అనిపిస్తుంది. మా అందరి లక్ష్యం 2024లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని మీట్ ది ప్రెస్లో మంత్రి కాకాణి అభిప్రాయపడ్డారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
చిన్న చిన్న తొందరపాట్లు జరిగి ఉంటాయి తప్ప ఎక్కడా సమస్య లేదు. నాకు రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ అన్నారు, దాంట్లో తప్పు ఏముంది? వివాదాస్పద వ్యాఖ్యల గురించి బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చించకూడదు. పండించడం, రైతులకు సహకారం అందించడం వ్యవసాయ శాఖ బాధ్యత. మిల్లర్లతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అలా మాట్లాడితే రైతులకు సమస్య ఉంటుంది. గిట్టుబాటు ధర అంశంలో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఇద్దరి మధ్య విబేధాలని మరింత పెంచేందుకు కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారు.
Read Also: Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరు, అనిల్ ఫ్లెక్సీలు నేను చించను, నా ఫ్లెక్సీలు ఆయన చించరు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్ని పరిష్కారం జరిపేలా అందరిని కలుపుకుని ముందుకెళ్తామన్నారు మంత్రి కాకాణి. అధికార పార్టీపై బురదజల్లేందుకే పవన్ కళ్యాణ్ యాత్ర చేపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నటనకు సరిపోతారు, రాజకీయాల్లో పనికిరాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!