Jogi Ramesh: జోగి రమేష్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు..
- నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్..
- జోగి రమేష్ అరెస్ట్ ను ఖండించిన వైసీపీ శ్రేణులు..
- జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్పై వైసీపీ నేతలు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు తీవ్రంగా ఖండించారు.
Read Also: Kanchana4 : పూజ – నోరా కాంబోతో లారెన్స్ కాంచన 4.. హారర్ కి గ్లామర్ టచ్..!
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
అయితే, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు.. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్థన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు.. దానిపై జోగి చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు.. లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు.
Read Also: Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
ఇక, కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను తమకు అంటించేందుు కుట్ర చేస్తున్నారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్.. దానిపై హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. అయితే, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో పలువురి దుర్మరణం, మొంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయలేదు.. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు.. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వైసీపీ నాయకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!